Political News

బీజేపీతో కటీఫ్ కు ఇదే కారణమా?

బీహార్ అధికారంలో ఉన్న మిత్రపక్షాల్లో దాదాపు చీలిక ఖాయమైపోయింది. బీజేపీ-జేడీయూ కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. కమలంపార్టీతో కటీఫ్ చెప్పాలని జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయించుకోవటంతో నరేంద్రమోడీకి పెద్ద షాకనే చెప్పాలి. అసలు ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేయాలని, బీజేపీకి గుడ్ బై చెప్పాలని నితీష్ ఎందుకు నిర్ణయించుకున్నారు ? ఎందుకంటే తానుకూడా మరో ఉధ్థద్ థాక్రే అవుతానని భయపడ్డారట. విషయం ఏమింటటే జేడీయూ ఎంఎల్ఏలతో బీజేపీ అగ్రనేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని నితీష్ కు సమాచారం అందిందట.

ఇప్పటికే మేఘాలయలో జేడీయూకి ఉన్న ఏడుగురు ఎంఎల్ఏల్లో ఆరుగురిని బీజేపీలోకి లాగేసుకున్నారు. అప్పుడే రెండుపార్టీల మధ్య అంతర్గతంగా పెద్ద గొడవైందట. ఇక ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్లను చూస్తే నితీష్ కు అసెంబ్లీ స్పీకర్ కు ఏమాత్రం పడటంలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇతరత్రా కానీ నితీష్ చెప్పిన ఏ విషయాన్ని స్పీకర్ పట్టించుకోవటంలేదు. స్పీకర్ ను మార్చాలని నితీష్ బీజేపీ అగ్ర నేతలకు ఎంత చెప్పినా పట్టించుకోలేదట.

పైగా బీహార్లో జరగాల్సిన అభివృద్ధిని కూడా బీజేపీ ఢిల్లీ నుండే పర్యవేక్షిస్తోందట. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఏదోరోజు బీజేపీ థాక్రేని దెబ్బకొట్టినట్లే తనను కూడా దెబ్బకొడుతుందని భయపడ్డారట. వెంటనే మేల్కొనకపోతే కష్టమని డిసైడ్ అయ్యారట. అందుకనే బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు రెడీ అయిపోయారు.

ఎప్పుడైతే కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయ్యారో వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోను, ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తోను టచ్ లోకి వెళ్ళారట. వాళ్ళిద్దరు ఓకే చెప్పిన తర్వాతే మంగళవారం జేడీయూ ఎంఎల్ఏలు, ఎంపీలతో నితీష్ సమావేశం పెట్టుకున్నారు. 243 మంది ఎంఎల్ఏల అసెంబ్లీలో ఆర్జేడీకి 80 మంది, బీజేపీకి 77, జేడీయూకి 43, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎంఎల్ఏలున్నారు. 

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

5 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

6 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

7 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

7 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

7 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

8 hours ago