Political News

బీజేపీతో కటీఫ్ కు ఇదే కారణమా?

బీహార్ అధికారంలో ఉన్న మిత్రపక్షాల్లో దాదాపు చీలిక ఖాయమైపోయింది. బీజేపీ-జేడీయూ కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. కమలంపార్టీతో కటీఫ్ చెప్పాలని జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయించుకోవటంతో నరేంద్రమోడీకి పెద్ద షాకనే చెప్పాలి. అసలు ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేయాలని, బీజేపీకి గుడ్ బై చెప్పాలని నితీష్ ఎందుకు నిర్ణయించుకున్నారు ? ఎందుకంటే తానుకూడా మరో ఉధ్థద్ థాక్రే అవుతానని భయపడ్డారట. విషయం ఏమింటటే జేడీయూ ఎంఎల్ఏలతో బీజేపీ అగ్రనేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని నితీష్ కు సమాచారం అందిందట.

ఇప్పటికే మేఘాలయలో జేడీయూకి ఉన్న ఏడుగురు ఎంఎల్ఏల్లో ఆరుగురిని బీజేపీలోకి లాగేసుకున్నారు. అప్పుడే రెండుపార్టీల మధ్య అంతర్గతంగా పెద్ద గొడవైందట. ఇక ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్లను చూస్తే నితీష్ కు అసెంబ్లీ స్పీకర్ కు ఏమాత్రం పడటంలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇతరత్రా కానీ నితీష్ చెప్పిన ఏ విషయాన్ని స్పీకర్ పట్టించుకోవటంలేదు. స్పీకర్ ను మార్చాలని నితీష్ బీజేపీ అగ్ర నేతలకు ఎంత చెప్పినా పట్టించుకోలేదట.

పైగా బీహార్లో జరగాల్సిన అభివృద్ధిని కూడా బీజేపీ ఢిల్లీ నుండే పర్యవేక్షిస్తోందట. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఏదోరోజు బీజేపీ థాక్రేని దెబ్బకొట్టినట్లే తనను కూడా దెబ్బకొడుతుందని భయపడ్డారట. వెంటనే మేల్కొనకపోతే కష్టమని డిసైడ్ అయ్యారట. అందుకనే బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు రెడీ అయిపోయారు.

ఎప్పుడైతే కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయ్యారో వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోను, ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తోను టచ్ లోకి వెళ్ళారట. వాళ్ళిద్దరు ఓకే చెప్పిన తర్వాతే మంగళవారం జేడీయూ ఎంఎల్ఏలు, ఎంపీలతో నితీష్ సమావేశం పెట్టుకున్నారు. 243 మంది ఎంఎల్ఏల అసెంబ్లీలో ఆర్జేడీకి 80 మంది, బీజేపీకి 77, జేడీయూకి 43, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎంఎల్ఏలున్నారు. 

This post was last modified on August 10, 2022 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

2 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

3 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

4 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

4 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

5 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

5 hours ago