ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. సార్వత్రిక సమరమే వచ్చినా.. అధికారులు అత్యంత కీలకం. అధికారుల ప్రమేయం.. వారి సహకారం లేకపోతే.. ఏ పార్టీ కూడా… గెలుపు గుర్రం ఎక్కే పరిస్థితి లేదు. గతంలోనూ ఇది రుజువైంది. చంద్రబాబు తమనురాచి రంపాన పెడుతున్నారనే భావన కలగడంతో.. ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో చంద్రబాబు తొలిసారి ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఇక, పొరుగున ఉన్న తమిళనాడు లోనూ.. ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూసిన.. అప్పటి జయలలిత.. గెలుపు ఖాయమని.. ప్రగాఢంగా విశ్వసించినా.. పరాజయం పాలయ్యారు. గత 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగింది కూడా ఇదే. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కొందరు చక్రాలు తిప్పారనే వాదన ఇప్పటికీ.. అధికారుల మధ్య హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటిలో ఎన్నికలకు ముందు.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో తీవ్ర అలసత్వం చేశారు.
దీంతో ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఫలితంగా.. లబ్ధిదారులకు చంద్రబాబు ఇచ్చిన సంక్షేమం అందలేదు. అనేక జిల్లాల్లో వేల సంఖ్యలో ట్రై సైకిళ్లు, వాహనాలు.. తోపుడు బళ్లు.. అలానే మూలనపడ్డాయి. ఎన్నికలకు రెండు మాసాల ముందు.. వీటిని ఆయా పథకాల్లో లబ్ధిదారులకు ఇచ్చి.. ఎన్నికల సమయంలో తనకు అనకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే.. అధికారులు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ.. ఆయా కలెక్టరేట్లలో ఇలాంటి వాహనాలు ఉన్నాయి.
అంటే.. ఎన్నికలకు ముందు.. అధికారులు చంద్రబాబు సర్కారుకు సహకరించలేదనేది కళ్లకు కనిపిస్తున్న వాస్తవం. కట్ చేస్తే.. ఇప్పుడు.. వైసీపీ పరిస్థితి కూడా ఇంతేనా? అనేది చర్చకు వస్తోంది. గతంలో కంటే.. కూడా ఇప్పుడు అధికారులు.. ఉద్యోగులకు పనిభారం పెరిగిపోయింది. పైగా కోర్టుల నుంచి అధికారులు మొట్టికాయలు తింటున్నారు. కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
ఇక, సాధారణ ఉద్యోగులు పీఆర్సీ, సహా.. ఇతర సొమ్ముల విషయంలోపై సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఉపాధ్యాయులు.. పాఠశాల విలీనం సహా.. బదిలీలకు వ్యతిరేకంగా.. గళం విప్పుతున్నారు. అంటే.. ఎలా చూసుకున్నా.. గతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడు కనిపిస్తోంది. అంతకు మించిన దుస్థితి వస్తోందని అంటున్నారు. మరి జగన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
This post was last modified on August 7, 2022 8:54 pm
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…