ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. సార్వత్రిక సమరమే వచ్చినా.. అధికారులు అత్యంత కీలకం. అధికారుల ప్రమేయం.. వారి సహకారం లేకపోతే.. ఏ పార్టీ కూడా… గెలుపు గుర్రం ఎక్కే పరిస్థితి లేదు. గతంలోనూ ఇది రుజువైంది. చంద్రబాబు తమనురాచి రంపాన పెడుతున్నారనే భావన కలగడంతో.. ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో చంద్రబాబు తొలిసారి ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఇక, పొరుగున ఉన్న తమిళనాడు లోనూ.. ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూసిన.. అప్పటి జయలలిత.. గెలుపు ఖాయమని.. ప్రగాఢంగా విశ్వసించినా.. పరాజయం పాలయ్యారు. గత 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగింది కూడా ఇదే. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కొందరు చక్రాలు తిప్పారనే వాదన ఇప్పటికీ.. అధికారుల మధ్య హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటిలో ఎన్నికలకు ముందు.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో తీవ్ర అలసత్వం చేశారు.
దీంతో ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఫలితంగా.. లబ్ధిదారులకు చంద్రబాబు ఇచ్చిన సంక్షేమం అందలేదు. అనేక జిల్లాల్లో వేల సంఖ్యలో ట్రై సైకిళ్లు, వాహనాలు.. తోపుడు బళ్లు.. అలానే మూలనపడ్డాయి. ఎన్నికలకు రెండు మాసాల ముందు.. వీటిని ఆయా పథకాల్లో లబ్ధిదారులకు ఇచ్చి.. ఎన్నికల సమయంలో తనకు అనకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే.. అధికారులు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ.. ఆయా కలెక్టరేట్లలో ఇలాంటి వాహనాలు ఉన్నాయి.
అంటే.. ఎన్నికలకు ముందు.. అధికారులు చంద్రబాబు సర్కారుకు సహకరించలేదనేది కళ్లకు కనిపిస్తున్న వాస్తవం. కట్ చేస్తే.. ఇప్పుడు.. వైసీపీ పరిస్థితి కూడా ఇంతేనా? అనేది చర్చకు వస్తోంది. గతంలో కంటే.. కూడా ఇప్పుడు అధికారులు.. ఉద్యోగులకు పనిభారం పెరిగిపోయింది. పైగా కోర్టుల నుంచి అధికారులు మొట్టికాయలు తింటున్నారు. కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
ఇక, సాధారణ ఉద్యోగులు పీఆర్సీ, సహా.. ఇతర సొమ్ముల విషయంలోపై సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఉపాధ్యాయులు.. పాఠశాల విలీనం సహా.. బదిలీలకు వ్యతిరేకంగా.. గళం విప్పుతున్నారు. అంటే.. ఎలా చూసుకున్నా.. గతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడు కనిపిస్తోంది. అంతకు మించిన దుస్థితి వస్తోందని అంటున్నారు. మరి జగన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
This post was last modified on August 7, 2022 8:54 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…