ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. సార్వత్రిక సమరమే వచ్చినా.. అధికారులు అత్యంత కీలకం. అధికారుల ప్రమేయం.. వారి సహకారం లేకపోతే.. ఏ పార్టీ కూడా… గెలుపు గుర్రం ఎక్కే పరిస్థితి లేదు. గతంలోనూ ఇది రుజువైంది. చంద్రబాబు తమనురాచి రంపాన పెడుతున్నారనే భావన కలగడంతో.. ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో చంద్రబాబు తొలిసారి ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఇక, పొరుగున ఉన్న తమిళనాడు లోనూ.. ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూసిన.. అప్పటి జయలలిత.. గెలుపు ఖాయమని.. ప్రగాఢంగా విశ్వసించినా.. పరాజయం పాలయ్యారు. గత 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగింది కూడా ఇదే. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కొందరు చక్రాలు తిప్పారనే వాదన ఇప్పటికీ.. అధికారుల మధ్య హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటిలో ఎన్నికలకు ముందు.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో తీవ్ర అలసత్వం చేశారు.
దీంతో ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఫలితంగా.. లబ్ధిదారులకు చంద్రబాబు ఇచ్చిన సంక్షేమం అందలేదు. అనేక జిల్లాల్లో వేల సంఖ్యలో ట్రై సైకిళ్లు, వాహనాలు.. తోపుడు బళ్లు.. అలానే మూలనపడ్డాయి. ఎన్నికలకు రెండు మాసాల ముందు.. వీటిని ఆయా పథకాల్లో లబ్ధిదారులకు ఇచ్చి.. ఎన్నికల సమయంలో తనకు అనకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే.. అధికారులు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ.. ఆయా కలెక్టరేట్లలో ఇలాంటి వాహనాలు ఉన్నాయి.
అంటే.. ఎన్నికలకు ముందు.. అధికారులు చంద్రబాబు సర్కారుకు సహకరించలేదనేది కళ్లకు కనిపిస్తున్న వాస్తవం. కట్ చేస్తే.. ఇప్పుడు.. వైసీపీ పరిస్థితి కూడా ఇంతేనా? అనేది చర్చకు వస్తోంది. గతంలో కంటే.. కూడా ఇప్పుడు అధికారులు.. ఉద్యోగులకు పనిభారం పెరిగిపోయింది. పైగా కోర్టుల నుంచి అధికారులు మొట్టికాయలు తింటున్నారు. కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
ఇక, సాధారణ ఉద్యోగులు పీఆర్సీ, సహా.. ఇతర సొమ్ముల విషయంలోపై సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఉపాధ్యాయులు.. పాఠశాల విలీనం సహా.. బదిలీలకు వ్యతిరేకంగా.. గళం విప్పుతున్నారు. అంటే.. ఎలా చూసుకున్నా.. గతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడు కనిపిస్తోంది. అంతకు మించిన దుస్థితి వస్తోందని అంటున్నారు. మరి జగన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
This post was last modified on August 7, 2022 8:54 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…