గడిచిన కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో ట్విస్టు ఇచ్చారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. పార్టీ లైన్ కు భిన్నంగా ఆయన వ్యవహారశైలి ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి పేరిట ఒక నోటీసు అందుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. పార్టీకి చిరాకు తెప్పించేలా కొత్త లా పాయింట్లను తెర మీదకు తీసుకొచ్చారు.
రఘురామ కృష్ణంరాజు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు షాకిచ్చేందుకు వీలుగా ప్లాన్ సిద్ధం చేశారు. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వీలుగా ఎంపీలను లోక్ సభ స్పీకర్ వద్దకు పంపనున్న విషయం తెలిసిందే. ఇలాంటివేళ.. రఘురామ ఊహించని విధంగా రియాక్టు అయ్యారు.
తనపై అనర్హత వేటు వేయాలని.. సస్పెన్షన్ చర్యలు తీసుకునేలా పార్టీ యోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవాలని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యల్ని తాను చేయలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.. తనపై చర్యల అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద షోకాజ్ నోటీసులు వచ్చాయని.. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున ఎన్నికైనందుకు తనకు ఆ పేరు మీద షోకాజ్ నోటీసు ఇవ్వని వైనాన్ని ఎత్తి చూపించానని పేర్కొన్నారు. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ఏపీ హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మహమ్మారి తీవ్రత కారణంగా అత్యవసర కేసుల్ని మాత్రమే కోర్టు విచారిస్తోంది. రఘురామ తాజా తీరుపై ఏపీ అధికారపక్షం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…