Political News

రఘురామ కొత్త ట్విస్టు.. అనర్హత అడ్డుకోవాలంటూ హైకోర్టుకు

గడిచిన కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో ట్విస్టు ఇచ్చారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. పార్టీ లైన్ కు భిన్నంగా ఆయన వ్యవహారశైలి ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి పేరిట ఒక నోటీసు అందుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. పార్టీకి చిరాకు తెప్పించేలా కొత్త లా పాయింట్లను తెర మీదకు తీసుకొచ్చారు.

రఘురామ కృష్ణంరాజు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు షాకిచ్చేందుకు వీలుగా ప్లాన్ సిద్ధం చేశారు. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వీలుగా ఎంపీలను లోక్ సభ స్పీకర్ వద్దకు పంపనున్న విషయం తెలిసిందే. ఇలాంటివేళ.. రఘురామ ఊహించని విధంగా రియాక్టు అయ్యారు.

తనపై అనర్హత వేటు వేయాలని.. సస్పెన్షన్ చర్యలు తీసుకునేలా పార్టీ యోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవాలని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యల్ని తాను చేయలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.. తనపై చర్యల అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద షోకాజ్ నోటీసులు వచ్చాయని.. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున ఎన్నికైనందుకు తనకు ఆ పేరు మీద షోకాజ్ నోటీసు ఇవ్వని వైనాన్ని ఎత్తి చూపించానని పేర్కొన్నారు. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ఏపీ హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మహమ్మారి తీవ్రత కారణంగా అత్యవసర కేసుల్ని మాత్రమే కోర్టు విచారిస్తోంది. రఘురామ తాజా తీరుపై ఏపీ అధికారపక్షం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.

This post was last modified on July 3, 2020 2:49 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

2 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

4 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

4 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

5 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

6 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

6 hours ago