వైసీపీ నేతల్లో కలవరం ప్రారంభమంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కీలకమైన ఒక విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అదే.. `రివర్స్ టెండరింగ్` అన్ని పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ విధానం అనుసరిస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే కామెంట్ పార్టీ విషయంలోనూ వినిపిస్తుండడమే తీవ్రంగా నాయకులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. “ఒకటి అంటే.. నెట్టుకువస్తాం.. రెండంటే.. నెట్టుకొస్తాం.. కానీ, ఇన్ని విషయాల్లో రివర్స్ అయితే.. ఏం చేయాలి“ ఇదీ.. వైసీపీ నాయకులు అంటున్న మాట.
గత ఎన్నికలకు ముందు.. జగన్ నిర్వహించిన పాదయాత్రలో అనేక విషయాలపై ఆయన ప్రజలకు హామీలు ఇచ్చారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. ఇప్పటి వరకు కూడా వాటిని అమలు చేయడం లేదు. అంతేకాదు.. అసలు వాటిని అమలు చేస్తారో.. లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలోనే హామీలను బుట్టదాఖలు చేశారని.. వైసీపీనాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. వీటిలో కీలకమైనవి ఉన్నాయని అంటున్నారు.
+ ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ రద్దు ను వారంలోనే చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు చేయలేదు. ఇకపైచే సేది కూడా లేదని చెప్పారు.
+ అధికారంలోకి వచ్చిన తర్వాత.. విడతల వారీగా.. మద్యాన్ని నిషేధిస్తామని.. ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేనాటికి..రాష్ట్రాన్ని మద్యం రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామన్నారు.కానీ, ఇప్పుడు మద్య నిషేధం లేకపోగా.. మరో 25 సంవత్సరాల వరకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఎరగా చూపి.. 8000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు.
+ అధికారంలోకి రాగానే ఆరుమాసాల్లో మెగా డీఎస్సీ అంటూ.. నిరుద్యోగులను ఊరించారు.కానీ, ఇప్పటి వరకు ఊసే లేదు. పైగా.. పాఠశాలల విలీనంతో.. ప్రభుత్వం దగ్గరే చాలా మంది ఉద్యోగులు మిగిలిపోతున్నారని… చెబుతున్నారు. దీనిని బట్టి.. కొత్తవారితో అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇది నిరుద్యోగులకు అశనిపాతంగా మారింది.
+ ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వచ్చి తెస్తామన్నారు. ఇది గాలికి కొట్టుకుపోయింది.
+ పింఛన్లు.. రూ.250 చొప్పున వరసగా పెంచుతామన్నారు. దీని ప్రకారం ఇప్పటి వరకు రూ.750 పెరగాలి. కానీ, పెరిగింది మాత్రం రూ.250. దీనిపైనా సర్కారు ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది.
+ పోలవరం పూర్తి చేసి.. 2021 చివరి నాటికి ఇస్తామన్నారు. 2022 కూడా పూర్తవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఈ ఊసు లేదు. అసలు ఎప్పుడు పూర్తవుతుందో.. తెలియదని పరోక్షంగా జగనే చెప్పారు. ఇలా.. ఒకటి కాదు.. అనేక విషయాల్లో.. జగన్ తీసుకున్న రివర్స్ గేర్ ఇప్పుడు వైసీపీ నేతలను కలవరానికి గురిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆయా విషయాలపై ప్రజలకు రేపు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on August 7, 2022 6:42 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…