కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ పదే పదే లేవనెత్తుతున్న ప్రశ్న ఒకటే. అదేమిటంటే ఓటుకు నోటు కేసులో 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాను ఎలా పనిచేయగలనని. రేవంత్ ను ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా రాజగోపాల్ ఇదే ప్రశ్నను పదే పదే బహిరంగంగానే లేవనెత్తుతున్నారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు క్రాస్ ఓటింగ్ కోసం రూ. 50 లక్షలిస్తు ఏసీబీకి దొరికిన విషయం వాస్తవం.
ఈ కేసులోనే రేవంత్ 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చారు. ఇంకా కేసు కొనసాగుతునే ఉంది. రేవంత్ ను అవమానించాలన్న ఏకైక టార్గెట్ తోనే ఆయన ప్రత్యర్ధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇదే విషయాన్ని చుండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో తాను 30 రోజులు జైలుకు వెళ్ళి వచ్చింది వాస్తవమే అని అంగీకరించారు. తాను 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని చెబుతూనే అమిత్ షా 90 రోజులు జైలుకెళ్ళొచ్చిన మాట అబద్ధమా అని ప్రశ్నించారు.
తాను ఓటుకు నోటు కేసులో జైలు కెళితే అమిత్ షా మర్డర్ కేసులో 90 రోజులు జైలులో ఉండొచ్చారని గుర్తుచేశారు. తన నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడిన రాజగోపాల్ మరి 90 రోజులు జైలులో ఉండొచ్చిన అమిత్ షా నాయకత్వంలో ఎలా పనిచేస్తారంటు నిలదీశారు. ఢిల్లీలో అమిత్ షా పెట్టిన గడ్డి రాజగోపాల్ కు తియ్యగా ఉందా అని రాజగోపాల్ ను రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
మరి రేవంత్ అడిగిన ప్రశ్నకు రాజగోపాల్ సమాధానం చెప్పగలరా ? రేవంతన్నా ఓటుకునోటు కేసులో 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని అంగీకరించారు. మరి ఇదే పద్దతిలో అమిత్ షా కూడా అంగీకరిస్తారా ? రేవంత్ జైలుకు వెళ్ళి రావటమే రాజగోపాల్ అభ్యంతరమైతే అమిత్ షా అంతకన్నా ఎక్కువ రోజులు జైలులో ఉన్నది వాస్తవమే కదా ? మరి రాజగోపాల్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on August 6, 2022 9:17 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…