కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ పదే పదే లేవనెత్తుతున్న ప్రశ్న ఒకటే. అదేమిటంటే ఓటుకు నోటు కేసులో 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాను ఎలా పనిచేయగలనని. రేవంత్ ను ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా రాజగోపాల్ ఇదే ప్రశ్నను పదే పదే బహిరంగంగానే లేవనెత్తుతున్నారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు క్రాస్ ఓటింగ్ కోసం రూ. 50 లక్షలిస్తు ఏసీబీకి దొరికిన విషయం వాస్తవం.
ఈ కేసులోనే రేవంత్ 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చారు. ఇంకా కేసు కొనసాగుతునే ఉంది. రేవంత్ ను అవమానించాలన్న ఏకైక టార్గెట్ తోనే ఆయన ప్రత్యర్ధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇదే విషయాన్ని చుండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో తాను 30 రోజులు జైలుకు వెళ్ళి వచ్చింది వాస్తవమే అని అంగీకరించారు. తాను 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని చెబుతూనే అమిత్ షా 90 రోజులు జైలుకెళ్ళొచ్చిన మాట అబద్ధమా అని ప్రశ్నించారు.
తాను ఓటుకు నోటు కేసులో జైలు కెళితే అమిత్ షా మర్డర్ కేసులో 90 రోజులు జైలులో ఉండొచ్చారని గుర్తుచేశారు. తన నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడిన రాజగోపాల్ మరి 90 రోజులు జైలులో ఉండొచ్చిన అమిత్ షా నాయకత్వంలో ఎలా పనిచేస్తారంటు నిలదీశారు. ఢిల్లీలో అమిత్ షా పెట్టిన గడ్డి రాజగోపాల్ కు తియ్యగా ఉందా అని రాజగోపాల్ ను రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
మరి రేవంత్ అడిగిన ప్రశ్నకు రాజగోపాల్ సమాధానం చెప్పగలరా ? రేవంతన్నా ఓటుకునోటు కేసులో 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని అంగీకరించారు. మరి ఇదే పద్దతిలో అమిత్ షా కూడా అంగీకరిస్తారా ? రేవంత్ జైలుకు వెళ్ళి రావటమే రాజగోపాల్ అభ్యంతరమైతే అమిత్ షా అంతకన్నా ఎక్కువ రోజులు జైలులో ఉన్నది వాస్తవమే కదా ? మరి రాజగోపాల్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on August 6, 2022 9:17 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…