కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ పదే పదే లేవనెత్తుతున్న ప్రశ్న ఒకటే. అదేమిటంటే ఓటుకు నోటు కేసులో 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాను ఎలా పనిచేయగలనని. రేవంత్ ను ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా రాజగోపాల్ ఇదే ప్రశ్నను పదే పదే బహిరంగంగానే లేవనెత్తుతున్నారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు క్రాస్ ఓటింగ్ కోసం రూ. 50 లక్షలిస్తు ఏసీబీకి దొరికిన విషయం వాస్తవం.
ఈ కేసులోనే రేవంత్ 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చారు. ఇంకా కేసు కొనసాగుతునే ఉంది. రేవంత్ ను అవమానించాలన్న ఏకైక టార్గెట్ తోనే ఆయన ప్రత్యర్ధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇదే విషయాన్ని చుండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో తాను 30 రోజులు జైలుకు వెళ్ళి వచ్చింది వాస్తవమే అని అంగీకరించారు. తాను 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని చెబుతూనే అమిత్ షా 90 రోజులు జైలుకెళ్ళొచ్చిన మాట అబద్ధమా అని ప్రశ్నించారు.
తాను ఓటుకు నోటు కేసులో జైలు కెళితే అమిత్ షా మర్డర్ కేసులో 90 రోజులు జైలులో ఉండొచ్చారని గుర్తుచేశారు. తన నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడిన రాజగోపాల్ మరి 90 రోజులు జైలులో ఉండొచ్చిన అమిత్ షా నాయకత్వంలో ఎలా పనిచేస్తారంటు నిలదీశారు. ఢిల్లీలో అమిత్ షా పెట్టిన గడ్డి రాజగోపాల్ కు తియ్యగా ఉందా అని రాజగోపాల్ ను రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
మరి రేవంత్ అడిగిన ప్రశ్నకు రాజగోపాల్ సమాధానం చెప్పగలరా ? రేవంతన్నా ఓటుకునోటు కేసులో 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని అంగీకరించారు. మరి ఇదే పద్దతిలో అమిత్ షా కూడా అంగీకరిస్తారా ? రేవంత్ జైలుకు వెళ్ళి రావటమే రాజగోపాల్ అభ్యంతరమైతే అమిత్ షా అంతకన్నా ఎక్కువ రోజులు జైలులో ఉన్నది వాస్తవమే కదా ? మరి రాజగోపాల్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on August 6, 2022 9:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…