కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ పదే పదే లేవనెత్తుతున్న ప్రశ్న ఒకటే. అదేమిటంటే ఓటుకు నోటు కేసులో 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాను ఎలా పనిచేయగలనని. రేవంత్ ను ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా రాజగోపాల్ ఇదే ప్రశ్నను పదే పదే బహిరంగంగానే లేవనెత్తుతున్నారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు క్రాస్ ఓటింగ్ కోసం రూ. 50 లక్షలిస్తు ఏసీబీకి దొరికిన విషయం వాస్తవం.
ఈ కేసులోనే రేవంత్ 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చారు. ఇంకా కేసు కొనసాగుతునే ఉంది. రేవంత్ ను అవమానించాలన్న ఏకైక టార్గెట్ తోనే ఆయన ప్రత్యర్ధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇదే విషయాన్ని చుండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో తాను 30 రోజులు జైలుకు వెళ్ళి వచ్చింది వాస్తవమే అని అంగీకరించారు. తాను 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని చెబుతూనే అమిత్ షా 90 రోజులు జైలుకెళ్ళొచ్చిన మాట అబద్ధమా అని ప్రశ్నించారు.
తాను ఓటుకు నోటు కేసులో జైలు కెళితే అమిత్ షా మర్డర్ కేసులో 90 రోజులు జైలులో ఉండొచ్చారని గుర్తుచేశారు. తన నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడిన రాజగోపాల్ మరి 90 రోజులు జైలులో ఉండొచ్చిన అమిత్ షా నాయకత్వంలో ఎలా పనిచేస్తారంటు నిలదీశారు. ఢిల్లీలో అమిత్ షా పెట్టిన గడ్డి రాజగోపాల్ కు తియ్యగా ఉందా అని రాజగోపాల్ ను రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
మరి రేవంత్ అడిగిన ప్రశ్నకు రాజగోపాల్ సమాధానం చెప్పగలరా ? రేవంతన్నా ఓటుకునోటు కేసులో 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని అంగీకరించారు. మరి ఇదే పద్దతిలో అమిత్ షా కూడా అంగీకరిస్తారా ? రేవంత్ జైలుకు వెళ్ళి రావటమే రాజగోపాల్ అభ్యంతరమైతే అమిత్ షా అంతకన్నా ఎక్కువ రోజులు జైలులో ఉన్నది వాస్తవమే కదా ? మరి రాజగోపాల్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on August 6, 2022 9:17 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…