Political News

కాంగ్రెస్.. కోమటిరెడ్డి బ్రదర్స్ ను లైట్ తీసుకుందా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. మునుగోడు ఎంఎల్ఏకి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారో వెంటనే అందరి దృష్టి అన్న, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైకి మళ్ళింది. ఎందుకంటే అన్నదమ్ములిద్దరు ఏ విషయంలో అయినా ఒకేమాట, ఒకేబాటగా ఉంటారు. రాజగోపాల్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎప్పటినుండో వినిపిస్తోంది. కొన్నిసార్లు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.

తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసే ముందు, చేసిన తర్వాత రాజగోపాల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. దానికి కౌంటర్ గా రేవంత్ కూడా ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు. అయితే ఎలాంటి సంబంధం లేకపోయినా మధ్యలో వెంకటరెడ్డి దూరారు. రేవంత్ తమను అవమానిస్తున్నాడంటు రెచ్చిపోయారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వరదలు, నష్టపరిహారం పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంకటరెడ్డి కలవటం.

నిజంగానే వరదలు, నష్టపరిహారంపైన మాత్రమే అమిత్ షాను కలవదలచుకుంటే మిగిలిన ఎంపీలను కూడా కలుపుకుని వెళ్ళుండేవారే. లేదా తన నియోజకవర్గం నుండి మద్దతుదారులతో కలిసి వెళ్ళుండాలి. కానీ అలా కాకుండా ఒంటరిగా వెళ్ళి కలవటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదోరోజు బ్రదర్స్ బీజేపీలో చేరటం ఖాయమని పార్టీలోను బయటా ప్రచారం జరుగుతున్నదే. ఆ విషయమే ఇపుడు బహిరంగంగా చర్చ జరుగుతోందంతే.

దీనిపై వెంకటరెడ్డి స్పందిస్తూ తనను పార్టీలో నుండి తరిమేసే కుట్ర జరుగుతోందని గోల మొదలుపెట్టారు. వెంకటరెడ్డిని పార్టీ నుంచి తరిమేసేంత సీన్ పార్టీలో ఎవరికీ లేదని అందరికీ తెలుసు. తాను ఉండదలచుకుంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారంతే. కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోవటానికి డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే రేవంత్ టార్గెట్ గా రివర్స్ రాజకీయం మొదలుపెట్టారు. ఈ విషయాలు స్పష్టంగా కనబడుతుండటంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాంగ్రెస్ లైట్ గా తీసుకుంటున్నట్లే అనిపిస్తోంది.  

Satya

Recent Posts

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

55 minutes ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

1 hour ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

2 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

2 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

2 hours ago

ఆంధ్రాలో గద్దర్ విగ్రహం: పవన్ కల్యాణ్

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…

3 hours ago