ఒకరు తర్వాత.. ఒకరు. ఒకరిని మించి మరొకరు.. అన్నట్టుగా వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. దీంతో అటు.. పార్టీకి ఇటు ప్రభుత్వానికి, మరోవైపు.. పార్టీ అధినేత జగన్కు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. అంతేకాదు.. పార్టీ నేతలు చేస్తున్న తప్పులకు.. అంటున్న కామెంట్లకు.. జగన్ సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.. అప్పులు చేస్తున్నారంటూ.. విపక్షాలు వాయించేస్తున్నాయి. దీని నుంచే సమాధానం చెప్పలేక ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు.. ఏకంగా.. నాయకులు.. తెస్తున్న కొత్త తిప్పలు మరింతగా సర్కారుకు ప్రాణసంకటంగా మారాయి.
గతంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అరగంట చాలని.. ప్రస్తుత మంత్రి.. అంబటి రాంబాబు.. గంట కావాలని.. చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ లైవ్లోనే ఉన్నాయి. అంతేకాదు.. వారిద్దరిపైనా.. ఇప్పటి వరకు సర్కా రు చర్యలు తీసుకోలేదనే అపప్రద ఉండనే ఉంది. ఇక, ఎమ్మెల్సీ అనంతబాబు ఏకంగా.. తన అనుచరు డిని చంపేసి డోర్ డెలివరీ చేశాడని.. ప్రతిపక్షాలు ఇప్పటికీ నిప్పులు చెరుగుతున్నాయి.
మరోవైపు.. రాష్ట్రంలో ఎస్సీ మహిళలకు రక్షణలేదనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఎంపీ గోరంట్ల మాధవ్ ఉదంతం.. మరింత కాక రేపుతోంది. తన వీడియో ను మార్ఫింగ్ చేశారని.. ఆయన చెబుతున్నా.. ఇది నమ్మశక్యంగా లేదని.. స్పష్టంగా తెలుస్తున్నట్టు వైసీపీలోనే ఓ వర్గం నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇక దీనిపై మహిళా సంఘాలు.. ఇతర పార్టీల నాయకులు ఫైరవుతున్నారు.
ఈ నేపథ్యంలో అటు తిరిగి… ఇప్పుడు సీఎం జగన్ను ఉచ్చులోకి లాగినట్టు అయింది. తక్షణమే ఎంపీ గోరంట్లతో రాజీనామా చేయించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అదేసమయంలో మాధవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. కూడా మహిళా సంఘాల నాయకులు డిమాండ్లు చేస్తున్నారు. ఇంకోవైపు.. పార్టీ నాయకులు ఎవరూ కూడా ఈ ఘటనను ఖండించలేదు. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్లు కూడా.. ఎవరికి వారుమౌనంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ ఘటనను నిజమేనని నమ్మాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో జగన్ చుట్టూ.. మరో వివాదం చుట్టుముట్టిందని అంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 5, 2022 4:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…