Political News

తెలంగాణా కాంగ్రెస్ లో కొత్త పంచాయితి

కోమటిరెడ్డి రాజగోపాల్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేయటాన్ని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తట్టుకోలేకపోతున్నారా? తాజాగా రేవంత్ విషయమై  వెంకటరెడ్డి చేసిన డిమాండ్లు చూస్తే అందరికి ఇదే అనుమానం పెరిగిపోతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన దారుణమైన కామెంట్లకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి రేవంత్ ఆరోపణలు చేసింది కేవలం తమ్ముడు రాజగోపాల్ మీదేకానీ అన్న, దమ్ములు ఇద్దరినీ కలిపికాదు.

రాజగోపాల్ మీడియా సమావేశంలో రేవంత్ పై ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు కాబట్టే రేవంతే కూడా అంతే స్ధాయిలో రాజగోపాల్ పై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఇంతోటి దానికే మధ్యలో వెంకటరెడ్డి కలగజేసుకుని రేవంత్ పై రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ టీడీపీలో కీలకంగా ఉండి కాంగ్రెస్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే.  

కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు మాట్లాడినా రేవంత్ ను టార్గెట్ చేసుకుని ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. రేవంత్-రాజగోపాల్ వ్యవహారంలో వెంకటరెడ్డి తమ్ముడికి మద్దతుగా నిలబడటంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ్ముడి బాటలోనే అన్న కూడా ప్రయాణించటం ఖాయమేనా అని అనిపిస్తోంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అవటాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ తట్టుకోలేకపోతున్న విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ తో తమకున్న బంధాన్ని వెంకటరెడ్డి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

కాకపోతే బ్రదర్స్ ఇద్దరు నిత్య అసమ్మతి వాదులుగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. తాము కోరుకున్నట్లుగా పార్టీ ఉంటే సరి లేకపోతే రచ్చ మొదలుపెట్టేస్తారు. తాము కోరుకున్న పదవి దక్కక పోతే ఎంత గోల చేస్తారో పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనే అందరూ చూశారు. ఒకవైపు మునుగోడు ఉపఎన్నిక ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో వెంకటరెడ్డి మొదలుపెట్టిన కొత్త పంచాయితీ ఆశ్చర్యంగా ఉంది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ అభ్యర్ధి విజయానికి వెంకటరెడ్డి పనిచేయటం డౌటుగానే ఉంది. 

Satya

Recent Posts

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

23 minutes ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

37 minutes ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

43 minutes ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

59 minutes ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

1 hour ago

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

2 hours ago