Political News

కేంద్రంపై నిందలు మొదలుపెట్టిన వైసీపీ !

ఇపుడిదే ఎవరికీ అర్థం కావటం లేదు. రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు విజయసాయిరెడ్డితో పాటు కొందరు ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజికి నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తాను నరేంద్రమోడీకి కలిసినపుడు ఈ విషయమై నిలదీస్తానని చెప్పారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన రు. 20,000 కోట్లు ఆగిపోయినట్లు చెప్పారు.

కేంద్రంతో పోరాడైనా రావాల్సిన నిధులకోసం ప్రయత్నం చేస్తానన్నారు. గతంలో కేంద్రం నుండి రావాల్సిన బకాయిల గురించి ఎప్పుడూ ఇలా పబ్లిక్కులో మాట్లాడలేదు. ఇక రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అప్పుల విషయంలో రాష్ట్రాలను నిందిస్తున్న కేంద్రం తాను చేస్తున్న అప్పుల గురించి ఏమి చెబుతుందని నిలదీశారు. ఆర్ధిక పరిస్దితిపై లెక్కలు తీస్తే కేంద్రం పరిస్ధితికన్నా రాష్ట్రం పరిస్ధితి బాగానే ఉందన్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్దితిపై కావాలనే చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నట్లు సాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాల అప్పుల విషయంలో అసలు కేంద్రం తీరే సరిగా లేదన్నారు. సమర్ధుడైన జగన్ నాయకత్వంలో రాష్ట్రం పరిస్ధితి బాగానే ఉందని చెప్పారు. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరిగా ఇవ్వటంలేదంటు ఆరోపించారు. ఈ విషయాలపై కేంద్రం ఆత్మపరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించటమే ఆశ్చర్యంగా ఉంది.

ఒకవైపు జగన్ మరోవైపు సాయిరెడ్డి డైరెక్టుగానే కేంద్రాన్ని తప్పుపట్టడం, నిలదీయటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. గడచిన మూడేళ్ళల్లో ఎప్పుడూ జగన్ కానీ మంత్రులు, ఎంపీలు ఎవరు కూడా బహిరంగంగా కేంద్రాన్ని తప్పుపట్టలేదు. అలాంటిది వరుసగా కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదు. బహుశా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జనాలముందు కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎలాగూ రాష్ట్రప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తోందన్నవిషయం అందరికీ తెలిసిందే. దాన్నే జగన్ బహిరంగంగా ప్రస్తావిస్తున్నారేమో.

Satya

Recent Posts

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

9 minutes ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

12 minutes ago

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

21 minutes ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

32 minutes ago

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…

32 minutes ago

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…

44 minutes ago