ఇపుడిదే ఎవరికీ అర్థం కావటం లేదు. రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు విజయసాయిరెడ్డితో పాటు కొందరు ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజికి నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తాను నరేంద్రమోడీకి కలిసినపుడు ఈ విషయమై నిలదీస్తానని చెప్పారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన రు. 20,000 కోట్లు ఆగిపోయినట్లు చెప్పారు.
కేంద్రంతో పోరాడైనా రావాల్సిన నిధులకోసం ప్రయత్నం చేస్తానన్నారు. గతంలో కేంద్రం నుండి రావాల్సిన బకాయిల గురించి ఎప్పుడూ ఇలా పబ్లిక్కులో మాట్లాడలేదు. ఇక రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అప్పుల విషయంలో రాష్ట్రాలను నిందిస్తున్న కేంద్రం తాను చేస్తున్న అప్పుల గురించి ఏమి చెబుతుందని నిలదీశారు. ఆర్ధిక పరిస్దితిపై లెక్కలు తీస్తే కేంద్రం పరిస్ధితికన్నా రాష్ట్రం పరిస్ధితి బాగానే ఉందన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్దితిపై కావాలనే చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నట్లు సాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాల అప్పుల విషయంలో అసలు కేంద్రం తీరే సరిగా లేదన్నారు. సమర్ధుడైన జగన్ నాయకత్వంలో రాష్ట్రం పరిస్ధితి బాగానే ఉందని చెప్పారు. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరిగా ఇవ్వటంలేదంటు ఆరోపించారు. ఈ విషయాలపై కేంద్రం ఆత్మపరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఒకవైపు జగన్ మరోవైపు సాయిరెడ్డి డైరెక్టుగానే కేంద్రాన్ని తప్పుపట్టడం, నిలదీయటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. గడచిన మూడేళ్ళల్లో ఎప్పుడూ జగన్ కానీ మంత్రులు, ఎంపీలు ఎవరు కూడా బహిరంగంగా కేంద్రాన్ని తప్పుపట్టలేదు. అలాంటిది వరుసగా కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదు. బహుశా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జనాలముందు కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎలాగూ రాష్ట్రప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తోందన్నవిషయం అందరికీ తెలిసిందే. దాన్నే జగన్ బహిరంగంగా ప్రస్తావిస్తున్నారేమో.
This post was last modified on July 29, 2022 11:39 am
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…