సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో తీవ్రంగా నిరాశ పరిచాడు ప్రభాస్. ఐతే ఇప్పుడు అతడి చేతిలో ఉన్న సినిమాల మీద భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. అవన్నీ భారీ స్థాయి చిత్రాలే. అందుకే విడుదల విషయంలో సుదీర్ఘ నిరీక్షణ తప్పట్లేదు. ప్రభాస్ తర్వాతి రిలీజ్ ఆదిపురుష్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణకు మరీ ఎక్కువ సమయమేమీ పట్టలేదు. గత ఏడాదే షూటింగ్ ముగించేశారు.
మేకింగ్ కోసం ఏడాది కూడా సమయం పట్టలేదు. కానీ పోస్ట ప్రొడక్షన్ పని చాలా ఉండడంతో బాగా టైం తీసుకుంటున్నారు. షూటింగ్ అయ్యాక ఏడాదికి పైగా విరామం తర్వాత సినిమా రిలీజవుతుండటాన్ని బట్టి పోస్ట్ ప్రొడక్షన్ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్కు అంత ప్రాధాన్యం ఉంది ఆ చిత్రంలో. ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త చిత్రం ప్రాజెక్ట్-కె కూడా ఇందుకు భిన్నంగా ఏమీ అనిపించడం లేదు.
ప్రాజెక్ట్-కె రిలీజ్ విషయంలో తాజాగా నిర్మాత అశ్వినీదత్ మీడియాకు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబరు 18న దసరా కానుకగా కానీ.. లేదంటే 2024 సంక్రాంతికి కానీ రిలీజవుతుందని ఆయన వెల్లడించారు. ఐతే ప్రాజెక్ట్-కె షూటింగ్ మాత్రం 2023 జనవరికే పూర్తయిపోతుందట. ఇది హాలీవుడ్ ఎవెంజర్స్ తరహా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సినిమా. విజువల్ ఎఫెక్స్ట్ ప్రపంచ స్థాయిలోనే ఉండబోతున్నాయి. ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తామని.. ఇది పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
బడ్జెట్ కూడా రూ.500 కోట్లని అంటున్నారు. అందులో మెజారిటీ ఎఫెక్ట్స్ కోసమే పెట్టనున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు అందుకోసం పని చేయనున్నారు. వచ్చే జనవరి నుంచి 10-12 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించబోతున్నారన్నమాట. కుదిరితే 2023 అక్టోబరులో అన్నారు కానీ.. 2024 జనవరిలోనే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువ.
This post was last modified on July 29, 2022 9:44 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…