Political News

మీడియా లో కంగారూ కోర్టులు న‌డుస్తున్నాయ్‌: జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఫైర్‌

టీవీ ఛానెల్‌లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో ‘కంగారూ కోర్టు’ల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
మీడియా చర్చలు న్యాయవ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు. మీడియా వ్యక్తం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు, ప్రత్యేక ఎజెండాతో నడిచే చర్చలు భారత ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు.

మీడియా ప్రచారం చేస్తున్న ఏకపక్ష అభిప్రాయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఈ ప్రచారం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని వ్యవస్థకు హాని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.

అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకోవడానికి కష్టంగా ఉన్న సమస్యలపై మీడియా ‘కంగారూ కోర్టు’లను నడుపుతోందని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులపై అవగాహన లేకుండా సమస్యలపై ఒక అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరమని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

మీడియా 'కంగారూ కోర్టు'లను నడుపుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దీనివల్ల కొన్ని సమయాల్లో అనుభవాజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బంది పడాల్సివస్తోంది. కోర్టు తీర్పుల అంశంపై అవగాహన లేకుండా ఒక అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరం. మీడియా తన బాధ్యతలను అతిక్రమించి, నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తోంది. ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంతవరకు జవాబుదారీతనం ఉంది. అని వ్యాఖ్యానించారు.

కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనమే లేదన్నారు. మీడియా స్వీయ నియంత్రణ, పదాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీడియా ప్రధానంగా ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. మీడియా తన వాణిని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రగతిశీల, సుసంపన్న, శాంతియుత భారత నిర్మాణం కోసం వినియోగించాలని సీజేఐ సూచించారు.

This post was last modified on July 24, 2022 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago