ఔను..జగన్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆయన చేస్తున్న తప్పులు తమ పీకలమీదకు రాకుండా.. ప్రజల్లో తమ పరపతి పోకుండా చూసుకునేందుకు.. మోడీ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మాట వైసీపీ నేతలే చెబుతున్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ తపిస్తున్నారు. తద్వారా.. తాను భావిస్తున్న.. (ప్రజలు వ్యతిరేకించినా..) మూడు రాజధానులకు ముందడుగు పడుతుందని.. అనుకున్నారు.
అయితే.. కర్నూలులో హైకోర్టు విషయంపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒకందుకు మంచిదే అయినా..జగన్ కేంద్రం మధ్య ఉన్న పరిస్థితిని తీసుకుంటే.. ఆయనకు ఎఫెక్టేనని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రంతో రాసుకుని… పూసుకుని తిరుగుతున్న జగన్కు కేంద్రం కేసుల నుంచి తప్ప..ఆయనకు ఎలానూ ప్రయోజనం చేయడం లేదని.. అంతకు మించి రాష్ట్రానికి అంతకన్నా.. ప్రయోజనం కనిపించడం లేదని.. అంటున్నారు.
తాజాగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని భావించిన జగన్కు కేంద్రం నుంచి పెద్ద సమస్య వచ్చింది. “ముందు మీరు అక్కడ ఆమోదించుకుని.. మాకు ప్రతిపాదన పంపాలం”టూ.. కేంద్రం స్పష్టం చేసింది. అంటే.. ఈ ఉద్దేశం వెనుక.. కేంద్రలోని మోడీ సర్కారు.. జగన్ విషయంలో జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న మూడు రాజధానుల విషయంలో మోడీ ఒకింత జాగ్రత్తగా ఉన్నారని స్పష్టమవుతోంది.
ఎందుకంటే.. ఇప్పుడు కర్నూలులో కోర్టు ఏర్పాటు చేస్తే.. పరోక్షంగా.. లేదా ప్రత్యక్షంగా.. మోడీ కూడా మూడు రాజధానులకు మద్దతిచ్చినట్టే అవుతుందనేది వాస్తవం. దీనికి మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. అలాంటప్పుడు.. ఎలా ముందుకు వెళ్లాలి? జగన్ మునిగినా.. మనం ఎందుకు ప్రజలతో విమర్శలు చేయించుకోవాలి.. అనే వ్యూహంతోనే మోడీ ప్రబుత్వం కర్నూలులో హైకోర్టు విషయంలో బంతిని మళ్లీ జగన్ ప్రభుత్వం కోర్టులోకే నెట్టేసింది. ఏదేమైనా.. రాజకీయం రాజకీయమే.. అన్నట్టుగా ఉంది పరిస్థితి! మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on July 23, 2022 2:34 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…