ఔను..జగన్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆయన చేస్తున్న తప్పులు తమ పీకలమీదకు రాకుండా.. ప్రజల్లో తమ పరపతి పోకుండా చూసుకునేందుకు.. మోడీ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మాట వైసీపీ నేతలే చెబుతున్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ తపిస్తున్నారు. తద్వారా.. తాను భావిస్తున్న.. (ప్రజలు వ్యతిరేకించినా..) మూడు రాజధానులకు ముందడుగు పడుతుందని.. అనుకున్నారు.
అయితే.. కర్నూలులో హైకోర్టు విషయంపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒకందుకు మంచిదే అయినా..జగన్ కేంద్రం మధ్య ఉన్న పరిస్థితిని తీసుకుంటే.. ఆయనకు ఎఫెక్టేనని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రంతో రాసుకుని… పూసుకుని తిరుగుతున్న జగన్కు కేంద్రం కేసుల నుంచి తప్ప..ఆయనకు ఎలానూ ప్రయోజనం చేయడం లేదని.. అంతకు మించి రాష్ట్రానికి అంతకన్నా.. ప్రయోజనం కనిపించడం లేదని.. అంటున్నారు.
తాజాగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని భావించిన జగన్కు కేంద్రం నుంచి పెద్ద సమస్య వచ్చింది. “ముందు మీరు అక్కడ ఆమోదించుకుని.. మాకు ప్రతిపాదన పంపాలం”టూ.. కేంద్రం స్పష్టం చేసింది. అంటే.. ఈ ఉద్దేశం వెనుక.. కేంద్రలోని మోడీ సర్కారు.. జగన్ విషయంలో జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న మూడు రాజధానుల విషయంలో మోడీ ఒకింత జాగ్రత్తగా ఉన్నారని స్పష్టమవుతోంది.
ఎందుకంటే.. ఇప్పుడు కర్నూలులో కోర్టు ఏర్పాటు చేస్తే.. పరోక్షంగా.. లేదా ప్రత్యక్షంగా.. మోడీ కూడా మూడు రాజధానులకు మద్దతిచ్చినట్టే అవుతుందనేది వాస్తవం. దీనికి మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. అలాంటప్పుడు.. ఎలా ముందుకు వెళ్లాలి? జగన్ మునిగినా.. మనం ఎందుకు ప్రజలతో విమర్శలు చేయించుకోవాలి.. అనే వ్యూహంతోనే మోడీ ప్రబుత్వం కర్నూలులో హైకోర్టు విషయంలో బంతిని మళ్లీ జగన్ ప్రభుత్వం కోర్టులోకే నెట్టేసింది. ఏదేమైనా.. రాజకీయం రాజకీయమే.. అన్నట్టుగా ఉంది పరిస్థితి! మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on July 23, 2022 2:34 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…