వైసీపీ ఎమ్మెల్యేలు లోలోపల ర‌గిలిపోతున్నారట

ఔను! ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ర‌గిలిపోతున్నారు. త‌ప్పులు మీరు చేసి.. మాపై నింద‌లు మోపుతారా? అని కొంద‌రు అంటుంటే.. మీరు చేస్తున్న త‌ప్పుల‌కు మేం ప్ర‌జ‌ల‌తో తిట్టించుకుంటున్నాం.. అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించ‌డ‌మే. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆయ‌న ఎమ్మెల్యేల‌కు రెండుసార్లు క్లాస్ ఇచ్చారు. పార్టీ ప్ర‌తిష్టా త్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మాన్ని కొంద‌రు మాత్ర‌మే మ‌న‌సు పెట్టి చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లు స్తున్నార‌ని అన్నారు.

దీనిపై ఇప్ప‌టికే ఒక‌ద‌ఫా స‌ర్వే కూడా చేయించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ స‌ర్వేలో మంచి మార్కులు వ‌చ్చిన వారికే.. తిరిగి టికెట్లు ఇస్తామ‌న్నారు. కాబ‌ట్టి.. ప్ర‌తి ఒక్క‌రూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అయితే.. ఎమ్మెల్యేలు పైకి మాత్రం జ‌గ‌న్ చెప్పిన దానికి త‌లాడించినా.. లోలోన మాత్రం మ‌థ‌న ప‌డుతున్నారు. “ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే భ‌య‌మేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. వెళ్లిన ప్ర‌తి చోటా.. ప్ర‌జ‌ల నుంచి ఛీత్కారాలే వ‌చ్చాయి. బూతులు కూడా తిడుతున్నారు. ఏ మొహం పెట్టుకుని వ‌చ్చారంటూ.. మొహం మీదే అడిగేస్తున్నారు” అని సీమ‌కు చెందిన ఎమ్మెల్యే ఒక‌రు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

“కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టుక‌ని ఎమ్మెల్యే అయ్యాను. నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టాలంటే.. భ‌యం వేస్తోంది. అభివృద్ధి లేదు. చిన్న రోడ్డు కూడా వేయ‌లేక‌పోయాను. ఏమొహం పెట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లాలి. వెళ్తే.. వారు తిట్టిపోస్తున్నారు. మేం చేయ‌ని త‌ప్పున‌కు మేం తిట్టు తినాలా?“ అని మ‌రో ఎమ్మెల్యే(ఈయ‌న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే) వాపోయా రు. ఇదే ఆవేద‌న‌ను చాలా మంది ఎమ్మెల్యేలు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. “ఇప్ప‌టికిమూడేళ్ల యింది.. రూపాయి ఇవ్వ‌లేదు. అభివృద్ధి చేయ‌కుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డం ఎందుకు? వెళ్లినా.. మాకు తిట్లు.. అధినేత‌కు పొగ‌డ్త‌లు. ఇంతేగా!” అని ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఇద్ద‌రు నేత‌లు వ్యాఖ్యానించారు.

అంటే .. ఇత‌మిత్థంగా వైసీపీలో ఎమ్మెల్యేలు.. జ‌గ‌న్‌ పై తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న‌.. అంత‌కుమించిన ఆగ్ర‌హంతో ఉన్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నిజానికి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యినా.. ఎమ్మెల్యే నిధులు ఇవ్వ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గాల కు రూపాయి విద‌ల్చ‌లేదు. పైగా.. మూడు కీల‌క ఎన్నిక‌లు వ‌చ్చాయి. పంచాయ‌తీ, కార్పొరేష‌న్లు, ప‌రిష‌త్‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిని కూడా నేత‌ల‌పైకే నెట్టేశారు. దీంతో వారు అప్పులు చేసి మ‌రీ.. ఖ‌ర్చులు చేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు క‌నీస మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. తామెందుకు తిట్లు తినాల‌నేది ఎమ్మెల్యేల మాట‌. మ‌రి దీనికి జ‌గ‌న్ ప‌రిష్కారం చూపిస్తారా? లేక‌.. వ‌దిలేస్తారా? అనేది చూడాలి.