పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంపై కేంద్రలోని మోడీ ప్రభుత్వం తొలిసారి తీవ్రస్థాయిలో రియా క్ట్ అయింది. పార్లమెంటు వేదిగా.. వైసీపీ సర్కారును కడిగేసింది. “తప్పు మాది కాదు.. ఏపీదే.. ఏపీ చేసింది ముమ్మాటికీ తప్పే.. పోలవరం జాప్యం ఏపీ సర్కారు వల్లే అవుతోంది” అని కేంద్రం తీవ్రస్థాయిలో విమర్శ లు గుప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని.. దానికి తగిన విధంగా ఏర్పాటు చేస్తా మని తాము హామీ కూడా ఇచ్చామని.. కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆలస్యమైనట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవటమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థతో సమన్వయ లోపంతోపాటు.. కరోనా మహమ్మారి కూడా పోలవరం ఆలస్యానికి కారణమయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.
పోలవరం విషయంలో రాష్ట్రం అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మా ణం, నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించింది. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని పీపీఏ నివేదించినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2024 జులై వరకు సమయం అవసరమని తేల్చింది.
2014నాటి పోలవరం కేటాయింపులపై మరోసారి సమీక్షించేందుకు పీపీఏ ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. తాము ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు జవాబిచ్చారు. మరి కేంద్రమే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత.. వైసీపీ సర్కారు ఏం సమాధానం చెబుతుందో ఎలా.. కవర్ చేస్తుందో చూడాలి.
This post was last modified on July 19, 2022 6:29 pm
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…