ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల మధ్య వివాదం చెలరేగింది. మీ వల్లే మా భద్రాచలం మునిగిపోయిందని.. మంత్రి పువ్వాడ అజయ్ అనగానే.. అటు వైపు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే రియాక్ట్ అయ్యారు. మీ పనిమీరు చూసుకుంటే మంచిది.. అని ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు భద్రాచలంలో వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు. భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ వివరించారు. పోలవరం పూర్తయితే భద్రాచలం వద్ద 45 అడుగుల వరద ఉంటుందని చెప్పారు.
భద్రాచలం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ తెలిపారు. భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు పువ్వాడ వెల్లడించారు. “ముంపు ప్రజల కోసం ముఖ్యమంత్రి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు. దాదాపు 72 అడుగుల గోదావరి ప్రవాహం, 25లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. పోలవరం ఎత్తు తగ్గించాలని మేము చాలా సార్లు డిమాండ్ చేశాం. భద్రాచలం కరకట్ట ఎత్తు మరింత పెంచాల్సిన అవసరం ఉంది.” అన్నారు.
“అడ్ర భూభాగం నుంచి గోదావరి నీళ్లు ఎక్కువగా గ్రామాల్లోకి వస్తున్నాయి. కరకట్ట నిర్మాణం కోసం నిపుణుల బృందం పంపి- త్వరలోనే నిర్మాణం చేపడతాం అని సీఎం అన్నారు. వరదల వల్ల 8 సబ్ స్టేషన్లకు ఇబ్బంది కలిగితే అన్నింటిని పునరుద్ధరించాం. 240 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాం” అని తెలిపారు.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరూ తిరిగి ఇళ్లలోకి వెళ్తున్నారని పువ్వాడ అజయ్ తెలిపారు. వరదల వల్ల 25వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ఇంతటి భారీ వర్షాలకు ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. వరదల వల్ల 8 వేల కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు. వరదల వల్ల ప్రభావితమైన కుటుంబాల ఖాతాల్లోకి రేపటి నుంచి పరిహారం జమ చేస్తామని పువ్వాడ పేర్కొన్నారు.
బొత్స కౌంటర్
మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై వెంటనే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదన్నారు. తనకు సంబంధించని విషయాలు మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే.. ముఖ్యమంత్రులు చూసుకుంటారని అన్నారు.
This post was last modified on July 19, 2022 4:20 pm
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…