Political News

టీడీపీ, జనసేన పోటీచేస్తాయా ?

మార్చిలో రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీ చేస్తాయా ? ఇపుడిదే అంశంపై చర్చ మొదలైంది. వచ్చే మార్చిలో మూడు ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల కోటాలో భర్తీ అవబోయే ఎంఎల్సీల సంఖ్య మూడే అయినా ఓటర్లు మాత్రం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఉన్నారు.

ఈ మూడు నియోజకర్గాలు ఏమిటంటే కడప-కర్నూలు-అనంతపురం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నియోజకవర్గాల నుండి బీజేపీ నేత మాధవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే కర్నూలు-అనంతపురం, కడప నియోజకవర్గానికి వైసీపీ నేత వెన్నపూస గోపాలరెడ్డి ఎంఎల్సీగా ఉన్నారు. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గానికి పీడీఎఫ్ తరపున శ్రీనివాసులరెడ్డి ఎంఎల్సీగా ఉన్నారు.

పై మూడు నియోజకవర్గాలను కచ్చితంగా గెలుచుకోవాలని జగన్ ఎంఎల్ఏలతో జరిగిన సమీక్షలో నిర్దేశించారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన ఎంఎల్ఏలతో మాట్లాడిన తర్వాత జగన్ అభ్యర్ధులను కూడా ప్రకటించారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గం నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, కడప, కర్నూలు, అనంతపురం నుంచి గోపాలరెడ్డి కొడుకు వెన్నపూస రవీంద్రారెడ్డి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు నుండి వేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పోటీ చేయబోతున్నారు.

వచ్చే మార్చిలో జరగబోయే ఎన్నికలు పూర్తిగా అర్బన్ ఓరియంటెడ్ గా జరగబోతోంది. ప్రతి నియోజకవర్గంలోను కొన్ని లక్షలమంది ఓటర్లుంటారు. మూడేళ్ళ జగన్ పాలనపై అర్బన్ ఓటర్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనేందుకు ఒక సంకేతంగా ఉపయోగపడతాయి. మరిలాంటి ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీ చేస్తాయా ? అనేది ఆసక్తిగా మారింది. గెలుపోటములు ఇక్కడ కీలకం కాకపోయినా ఓటర్ల మనోభావాలు ఎలాగున్నయన్న విషయం బయటపడుతుంది. కాబట్టి రెండు ప్రతిపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. మరి ఏమి చేస్తాయో చూడాలి.

This post was last modified on July 19, 2022 11:28 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సినీ ప్రపంచం కళ్ళన్నీ కల్కి వేడుక మీదే

రేపు సాయంత్రం కల్కి 2898 ఏడి ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు…

38 mins ago

కవితకు బెయిల్ ఎందుకు రావడం లేదు ?

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు అరెస్టయ్యారు.…

2 hours ago

వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో…

2 hours ago

బొత్స ‘ముహూర్తం’ పెట్టారు.. వైవీ ‘స‌మ‌యం’ నిర్ణ‌యించారు!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాట‌లే కాదు.. ఆశ‌లు కూడా కోట‌లు దాటుతున్నాయి. ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్‌లో…

3 hours ago

బాల‌య్య హ్యాట్రిక్ ప‌క్కా.. కానీ చీలే ఓట్లెన్ని?

హిందూపురం.. టీడీపీ కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదొక‌టి. ఇక్క‌డ టీడీపీకి ఎదురేలేదు. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన నంద‌మూరి బాల‌కృష్ణ ఈ…

4 hours ago

హరోంహర….తెలివైన పని చేసెరా

సుధీర్ బాబు గంపెడాశలు పెట్టుకున్న హరోంహర విడుదల వాయిదా పడింది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్నట్టు అధికారికంగా…

4 hours ago