Political News

టీడీపీ కంచుకోట‌ల ప‌రిస్థితేంటి?

ఔను.. టీడీపీకి కంచుకోట‌ల్లా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌ను తిరిగి ద‌క్కించుకుంటామా? అస‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎలా పుంజుకుంది? ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా, ఉభ‌య గోదావ‌రి, శ్రీకాకుళం.. ఇలా పలు జిల్లాల్లో వైసీపీ ఎలా దూకుడు ప్ర‌ద‌ర్శించింది? అనేది టీడీపీ నేత‌ల మ‌ధ్య మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. ఇలా ఎందుకు జ‌రిగింద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీనిపై మ‌రోసారి టీడీపీ నేత‌లు క‌స‌ర‌త్తు ప్రారంభించారు.

పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఉదాహ‌ర‌ణ‌కు తాడిప‌త్రి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, కొవ్వూరు(ప‌శ్చిమ గోదావ‌రి), ఏలూరు, దెందులూరు, పెన‌మ‌లూరు, గుర‌జాల‌, వినుకొండ‌. ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. పైగా వీరిపై ఎలాంటి ఆరోప‌ణ‌లు కూడా లేవు. ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కులు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే నాయ‌కులే ఉన్నారు. అయితే.. వీరంతా ఓడిపోయారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు సైతం కాలికి చెప్పులు అరిగిపోయేలా తిరిగి ప్ర‌చారం చేశారు. అయినా కూడా వీరు ఓడిపోయారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. అయితే.. పార్టీ ఎందుకు ఇక్కడ ఓడిపోయింది? అనేది ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. కొన్నాళ్ల కింద‌ట పార్టీ ఇంచార్జ్‌ల‌తో తెప్పించుకున్న నివేదిక‌ల్లో కూడా ‘అంతా బాగానే ఉంది’ అనే రిపోర్టు వ‌చ్చింది. మ‌రి ఎలా వీరంతా ఓడిపోయారు? అనేది ఆస‌క్తిగా ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎలా ద‌క్కించుకోవాలి? అనే విష‌యంపై పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో ఎంతెంత ఓటింగ్ త‌గ్గిందో లెక్క‌లు వేసుకోవాల‌ని.. మండ‌లాల వారీగా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని.. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి ద‌క్కించుకోవాల‌ని.. కంచుకోట‌ల‌ను ప‌దిలం చేసుకోవాల‌ని.. ఆయ‌న సూచించిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో ప‌టిష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని.. ఎక్క‌డా తేడా రాకుండా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రి త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 19, 2022 10:54 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

6 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

6 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

7 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

8 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

8 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

8 hours ago