Political News

టీడీపీ కంచుకోట‌ల ప‌రిస్థితేంటి?

ఔను.. టీడీపీకి కంచుకోట‌ల్లా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌ను తిరిగి ద‌క్కించుకుంటామా? అస‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎలా పుంజుకుంది? ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా, ఉభ‌య గోదావ‌రి, శ్రీకాకుళం.. ఇలా పలు జిల్లాల్లో వైసీపీ ఎలా దూకుడు ప్ర‌ద‌ర్శించింది? అనేది టీడీపీ నేత‌ల మ‌ధ్య మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. ఇలా ఎందుకు జ‌రిగింద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీనిపై మ‌రోసారి టీడీపీ నేత‌లు క‌స‌ర‌త్తు ప్రారంభించారు.

పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఉదాహ‌ర‌ణ‌కు తాడిప‌త్రి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, కొవ్వూరు(ప‌శ్చిమ గోదావ‌రి), ఏలూరు, దెందులూరు, పెన‌మ‌లూరు, గుర‌జాల‌, వినుకొండ‌. ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. పైగా వీరిపై ఎలాంటి ఆరోప‌ణ‌లు కూడా లేవు. ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కులు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే నాయ‌కులే ఉన్నారు. అయితే.. వీరంతా ఓడిపోయారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు సైతం కాలికి చెప్పులు అరిగిపోయేలా తిరిగి ప్ర‌చారం చేశారు. అయినా కూడా వీరు ఓడిపోయారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. అయితే.. పార్టీ ఎందుకు ఇక్కడ ఓడిపోయింది? అనేది ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. కొన్నాళ్ల కింద‌ట పార్టీ ఇంచార్జ్‌ల‌తో తెప్పించుకున్న నివేదిక‌ల్లో కూడా ‘అంతా బాగానే ఉంది’ అనే రిపోర్టు వ‌చ్చింది. మ‌రి ఎలా వీరంతా ఓడిపోయారు? అనేది ఆస‌క్తిగా ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎలా ద‌క్కించుకోవాలి? అనే విష‌యంపై పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో ఎంతెంత ఓటింగ్ త‌గ్గిందో లెక్క‌లు వేసుకోవాల‌ని.. మండ‌లాల వారీగా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని.. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి ద‌క్కించుకోవాల‌ని.. కంచుకోట‌ల‌ను ప‌దిలం చేసుకోవాల‌ని.. ఆయ‌న సూచించిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో ప‌టిష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని.. ఎక్క‌డా తేడా రాకుండా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రి త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 19, 2022 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘సిందూర్’లో ఏం జరిగిందంటే..?

జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…

16 minutes ago

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ‘సిందూర్’ మద్దతు

ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…

37 minutes ago

‘ఆపరేషన్ సిందూర్’.. ఈ పేరే ఎందుకు పెట్టారంటే?

భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…

1 hour ago

వీరమల్లుకున్న ఇరకాటం అదొక్కటే

షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…

2 hours ago

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…

3 hours ago

పాక్ పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…

4 hours ago