Political News

వెంక‌య్య సాటి ఢిల్లీలో చ‌క్రం తిప్పేవారు ఉన్నారా..?

ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి. త్వ‌ర‌లోనే(ఆగ‌స్టు 11న‌) రిటైర్ కానున్నారు. అయితే.. ఆయ‌న దీనికి ముందు.. సుదీర్ఘ‌కాలంగా 40 ఏళ్లుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఇలా అనేక రూపాల్లో ఆయ‌న రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశార‌నడంలో సందేహం లేదు. స‌రే.. రాజ‌కీయాల్లో నాయ‌కులు వ‌స్తుంటారు.. పోతుంటారు.. అనుకుంటే.. ఇలాంటి నాయ‌కుడు మ‌ళ్లీ ఎవ‌రున్నారు? అనేది ఇప్పుడు చ‌ర్చ‌.

ఎందుకంటే.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రిటైర్ అవుతున్న వెంక‌య్య‌కు మ‌రోసారి చాన్స్ వ‌స్తుంద‌ని.. రాద‌ని.. అనేక చ‌ర్చలు తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. ఇంత జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న మ‌రోసారి ఉప‌రాష్ట్ర‌పతి గా పోటీకి విముఖ‌త చూపిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. సో.. ఆయ‌న ఇక‌, రిటైర్ అయిపోవ‌డం ఖాయం. మ‌రి నెక్ట్స్ ఏంటి? ఆయ‌న ఏం చేస్తారు.? అంటే.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రిటైర్ అయ్యాక‌.. ఇక‌, సంప్ర‌దాయం ప్ర‌కారం.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు.

పోనీ. ప‌రోక్షంగా అయినా.. రాజ‌కీయాలు చేస్తారా? అంటే.. అది ఆయ‌న ఇష్టం. కానీ.. ఒక్క‌మాట చెప్పుకోవాల్సి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి ఏదైనా క‌ష్టం వ‌స్తే.. టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. అంతో ఇంతో ఢిల్లీ వైపు చూస్తే.. క‌నిపిస్తున్న ‘తెలుగుముఖం’ వెంక‌య్య‌నాయుడు ఒక్క‌రే. గ‌తంలో ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు.. అమృత్ ప‌థ‌కం కానీ, అర్భ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ విష‌యంలో కానీ.. అనేక ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చారు. పైగా తెలుగు వారికి క‌ష్టం వ‌చ్చినా..ఆయ‌న ఆదుకున్నారు.

బాబు హ‌యంలో హుద్‌హుద్ తుఫాను వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌ధాని మోడీని ఆఘ‌మేఘాల‌పై ఏపీకి పంపించి.. నిధులు విడుద‌ల చేయించార‌నే పేరు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీకి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఆయ‌న నేరుగా కేంద్ర మంత్రుల‌ను త‌న వ‌ద్ద‌కు పిలిపించుకుని ప‌రిష్క‌రించే మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఆయ‌న రిటైర్ అయితే.. నెక్ట్స్ ఎవ‌రు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఈ త‌ర‌హాలో కేంద్రంలో చ‌క్రం తిప్పే నాయ‌కులు లేక‌పోవ‌డంతోపాటు.. బీజేపీ పెద్ద‌ల‌ను త‌న‌దైన శైలిలో త‌న‌వైపు తిప్పుకొనే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. అయితే.. యువ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి ఇప్పుడు మెరుస్తున్నారు. అయితే.. వెంక‌య్య స్థాయికి ఆయ‌న చేరాలంటే.. ప‌ది ప‌దేహేనేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఏదేమైనా.. వెంక‌య్య సాటి నాయ‌కుడు.. రాజ‌కీయాల‌కు దూరం కావ‌డం.. ఏపీకి లోట‌నే చెప్పాలి.

This post was last modified on July 14, 2022 6:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago