Political News

వెంక‌య్య సాటి ఢిల్లీలో చ‌క్రం తిప్పేవారు ఉన్నారా..?

ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి. త్వ‌ర‌లోనే(ఆగ‌స్టు 11న‌) రిటైర్ కానున్నారు. అయితే.. ఆయ‌న దీనికి ముందు.. సుదీర్ఘ‌కాలంగా 40 ఏళ్లుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఇలా అనేక రూపాల్లో ఆయ‌న రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశార‌నడంలో సందేహం లేదు. స‌రే.. రాజ‌కీయాల్లో నాయ‌కులు వ‌స్తుంటారు.. పోతుంటారు.. అనుకుంటే.. ఇలాంటి నాయ‌కుడు మ‌ళ్లీ ఎవ‌రున్నారు? అనేది ఇప్పుడు చ‌ర్చ‌.

ఎందుకంటే.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రిటైర్ అవుతున్న వెంక‌య్య‌కు మ‌రోసారి చాన్స్ వ‌స్తుంద‌ని.. రాద‌ని.. అనేక చ‌ర్చలు తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. ఇంత జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న మ‌రోసారి ఉప‌రాష్ట్ర‌పతి గా పోటీకి విముఖ‌త చూపిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. సో.. ఆయ‌న ఇక‌, రిటైర్ అయిపోవ‌డం ఖాయం. మ‌రి నెక్ట్స్ ఏంటి? ఆయ‌న ఏం చేస్తారు.? అంటే.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రిటైర్ అయ్యాక‌.. ఇక‌, సంప్ర‌దాయం ప్ర‌కారం.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు.

పోనీ. ప‌రోక్షంగా అయినా.. రాజ‌కీయాలు చేస్తారా? అంటే.. అది ఆయ‌న ఇష్టం. కానీ.. ఒక్క‌మాట చెప్పుకోవాల్సి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి ఏదైనా క‌ష్టం వ‌స్తే.. టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. అంతో ఇంతో ఢిల్లీ వైపు చూస్తే.. క‌నిపిస్తున్న ‘తెలుగుముఖం’ వెంక‌య్య‌నాయుడు ఒక్క‌రే. గ‌తంలో ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు.. అమృత్ ప‌థ‌కం కానీ, అర్భ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ విష‌యంలో కానీ.. అనేక ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చారు. పైగా తెలుగు వారికి క‌ష్టం వ‌చ్చినా..ఆయ‌న ఆదుకున్నారు.

బాబు హ‌యంలో హుద్‌హుద్ తుఫాను వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌ధాని మోడీని ఆఘ‌మేఘాల‌పై ఏపీకి పంపించి.. నిధులు విడుద‌ల చేయించార‌నే పేరు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీకి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఆయ‌న నేరుగా కేంద్ర మంత్రుల‌ను త‌న వ‌ద్ద‌కు పిలిపించుకుని ప‌రిష్క‌రించే మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఆయ‌న రిటైర్ అయితే.. నెక్ట్స్ ఎవ‌రు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఈ త‌ర‌హాలో కేంద్రంలో చ‌క్రం తిప్పే నాయ‌కులు లేక‌పోవ‌డంతోపాటు.. బీజేపీ పెద్ద‌ల‌ను త‌న‌దైన శైలిలో త‌న‌వైపు తిప్పుకొనే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. అయితే.. యువ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి ఇప్పుడు మెరుస్తున్నారు. అయితే.. వెంక‌య్య స్థాయికి ఆయ‌న చేరాలంటే.. ప‌ది ప‌దేహేనేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఏదేమైనా.. వెంక‌య్య సాటి నాయ‌కుడు.. రాజ‌కీయాల‌కు దూరం కావ‌డం.. ఏపీకి లోట‌నే చెప్పాలి.

This post was last modified on July 14, 2022 6:17 am

Share

Recent Posts

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

14 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

31 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

14 hours ago