రాష్ట్రంలో ‘ఎలక్షన్లు రాబోతున్నాయి.. టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. అన్నగారి(ఎన్టీఆర్) ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని ఆయన హితవు పలికారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ‘వేటగాడు’ సినిమాను వీక్షించారు.
ఎన్నికలు రాబోతున్నాయి.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ప్రదర్శించిన వేటగాడు సినిమాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్తో వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాయజ్ఞం లాంటి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు పూనుకున్న ఆలపాటి, తదితరులు ధన్యులుగా భావిస్తున్నామన్నారు.
తాను ఎన్నో సినిమాలు తీసినప్పటికీ ‘అడవి రాముడు’ సినిమాతోనే మంచి గుర్తింపు లభించిందన్నారు. తమను సినిమాల్లోకి తీసుకొచ్చి తమ భవిష్యత్తును బంగారు బాటగా మలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. నేను కొత్త ఇల్లు కట్టుకున్న తరువాత మొదటిగా ఆయనే కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించారని చెప్పారు. అన్నగారితో గడిపిన ఆ క్షణాలు.. నేటికీ తమ గుండెల్లో మెదులుతూనే ఉన్నాయన్నారు. ఏ నటులకు సంవత్సరంపాటు సినిమాలు ప్రదర్శించడం కుదరదని, ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా తెనాలిలో ఏడాదిపాటు అన్నగారి సినిమాలు ప్రదర్శించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
అన్నగారు చెప్పినట్లుగా ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అన్న నినాదాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పాటిస్తూ.. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించిస్తున్నట్లు రాఘవేంద్రరావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున మంచి కార్యక్రమాలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.. అన్నగారి ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని ఆయన హితవు పలికారు. సామాజిక సేవతోపాటు తెనాలితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని.. సాయిమాధవ్, ఆలపాటి రాజా మంచి సన్నిహితులని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…