ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి పంజాబ్ ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. తాజగా సింగ్రూర్ పార్లమెంటుకు జరిగిన ఉపఎన్నికలో ఆప్ పార్టీ అభ్యర్ధి ఓడిపోయారు. నెలల క్రితమే పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బాగానే పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి నియంత్రణకు, డ్రగ్ మాఫియా, గ్యాంగస్టర్లను ఏరేయటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
అవినీతిని కంట్రోల్ చేయటంలో భాగంగా తన క్యాబినెట్లోని మంత్రిపైనే కేసు నమోదుచేయించి అరెస్టు చేయించి జైలుకే పంపారు. దాంతో ఆప్ ప్రభుత్వం క్రెడిబులిటి అమాంతం పెరిగిపోయింది. 2014, 2019లో సింగ్రూర్ నుండి ఎంపీగా భగవంత్ మానే ఎంపికయ్యారు. ఇపుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రయ్యారు కాబట్టి ఎంపీగా రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అవసరమైంది.
నిజానికి ఈ ఎన్నికలో ఆప్ అభ్యర్ధి గుర్మైల్ సింగ్ గెలుపు నల్లేరుమీద నడకే అని అందరు అనుకున్నారు. ఎందుకంటే సింగ్రూర్ సీటు ముఖ్యమంత్రి రాజీనామా చేసిన సీటు కాబట్టి, సీఎంగా మాన్ కు మంచిమార్కులే పడుతున్నాయి కాబట్టి గెలుపు చాలా ఈజీ అనుకున్నారు. కానీ ఫలతాలు చూస్తే పెద్ద షాకే తగిలింది. ప్రత్యర్ధిగా పోటీచేసిన వారిలో సిరోమణి అకాలీదళ్(అమృతసర్) అభ్యర్ధి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ 5,822 ఓట్ల మెజారిటితో గెలిచారు.
కాంగ్రెస్ అభ్యర్ధి మూడోస్ధానానికి, అకాలీదళ్ అభ్యర్ధికి 5వ స్ధానానికి పడిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో 5 వేలతో గెలుపంటే పెద్ద మెజారిటీ ఏమీకాదన్న విషయం తెలిసిందే. కానీ ఒక్క ఓటుతో అయినా గెలుపు గెలుపే కదా. అందులోను అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆప్ లోక్ సభ ఉపఎన్నికలో ఓడిపోవటం భగవంత్ మాన్ తో పాటు ఇతర నేతలకు మింగుడుపడని విషయమే.
This post was last modified on June 27, 2022 2:32 pm
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…