తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ లీడర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అప్పుడే ఇది నిర్థారితం కాకున్నా, వచ్చే నెలలో హైద్రాబాద్ కేంద్రంగా జరిగే జాతీయ సమావేశాల కన్నా ముందే ఏదో ఒక నిర్ణయం పార్టీ అధినాయకత్వం వెలువరించే అవకాశాలే ఉన్నాయి అని తెలుస్తోంది. ఇప్పటిదాకా పనిచేసిన బండి సంజయ్ స్థానంలో ఈటలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమాయత్తం అవుతోందని ప్రాథమిక సమాచారం. అలా కాకుండా జాతీయ కార్యవర్గంలో ఈటలను చేర్చి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకునేందుకు కూడా బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ అయ్యారు. అనేక విషయాలపై ఆయనతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
ఎలా అయినా తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా అనూహ్య రీతిలో బలోపేతం చేసేందుకు అమిత్ షా చూస్తున్నారు. ఇక్కడ కూడా పార్టీ అధినాయకత్వం మార్పుపై యోచిస్తున్నారు. ఇక్కడ పురంధేశ్వరిని, అక్కడ ఈటలను నియమించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పకడ్బంధీగా నాయకత్వాన్ని ఉంచనున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ అసంతృప్తులను పార్టీలో చేర్పించేందుకు యోచిస్తున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్-ను కానీ కాంగ్రెస్-ను కానీ నమ్ముకుని నష్టపోయిన వారికి ఊతమిచ్చే చర్యలకు కూడా పూనుకోనున్నారు. ఎలా అయినా అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఫలితాలు తెచ్చుకోవాలని తపన అయితే బీజేపీలో ఉంది. వాస్తవానికి తెలంగాణలో బండి సంజయ్ భారీ స్థాయిలో నిరసనలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఆ మాటకు వస్తే బండి కన్నా రేవంత్ పూర్తిగా దూసుకుపోతున్నారు.
ముఖ్యంగా అవసరం మేరకు హిందుత్వ సంబంధ వ్యాఖ్యల వరకూ పరిమితం అయి, అనేక సందర్భాల్లో పాలక పార్టీకి అనుకూలంగా ఉంటున్నారన్న వాదన కూడా బండి సంజయ్ విషయమై ఉంది. పార్టీ తరఫున పోటీచేసి ఎవరు గెలిచినా వారిని పొగడ్తల్లో ముంచుడే తప్ప వారి విజయానికి శక్తి వంచన లేకుండా ఆయన కృషి చేసిన దాఖలాలు అయితే లేవు అన్న విమర్శ కూడా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే ఈటలకు తగు ప్రాధాన్యం ఇచ్చి బండిని తప్పిస్తే ఎలా ఉంటుందన్న వాదోపవాలు అధినాయకత్వంలో వినిపిస్తూ ఉన్నాయి.
This post was last modified on June 20, 2022 10:48 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…