దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 2020-21 సంవత్సర ఆదాయానికి సంబంధించిన గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే పార్టీల ఆదాయం భారీగా తగ్గిందని చెప్పడం గమనార్హం
జాతీయ పార్టీల ఆదాయ వివరాల నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి గానూ ఎనిమిది జాతీయ పార్టీలు రూ.1,373.78 కోట్ల ఆదాయాన్ని పొందాయని నివేదిక వెల్లడించింది. ఇందులో ఒక్క భారతీయ జనతా పార్టీ వాటానే 55 శాతమని పేర్కొంది.
రూ.752.33 కోట్లతో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, రూ.285.76 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 79.24 శాతం మేర బీజేపీ ఆదాయం తగ్గింది. అప్పట్లో రూ.3,623 కోట్లు కాగా తాజాగా రూ.752.33 కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఆదాయం కూడా అప్పటితో పోల్చితే 58.11 శాతం తగ్గింది.
టీఎంసీ, ఎన్సీపీ, బీఎస్పీ, ఎన్పీపీ, సీపీఐ ఆదాయం కూడా భారీగానే తగ్గింది. అన్ని పార్టీల కంటే గరిష్ఠంగా బీజేపీ ఖర్చు చేసింది. సుమారు రూ.566 కోట్ల మేర ప్రచారానికి వెచ్చించింది. రూ.180 కోట్ల ఖర్చుతో కాంగ్రెస్ తరువాతి స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ రూ.93 కోట్లు ఖర్చు చేసింది.
This post was last modified on June 18, 2022 7:00 am
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…