రాష్ట్రంలో కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం గుంటూరు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి టీడీ పీ విజయం దక్కించుకుంటోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున.. ఇక్కడ నుంచి గల్లా జయదేవ్ విజయం దక్కించుకున్నారు. 2019లో జగన్ సునామీని తట్టుకుని మరీ ఆయన విజయం దక్కించుకున్నారు. ఇక, రెండు సార్లు.. ఇక్కడ నుంచి పోటీ చేసిన వైసీపీకి పరాజయమే ఎదురైంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎవరిని బరిలో నిలపాలన్న విషయంపై.. ఈ రెండు పార్టీల్లోనూ తర్జన భర్జన కనిపిస్తోంది.
టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటుకు కాకుండా.. ఈ దఫా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలనిభావిస్తున్నారు. ఆయన మాతృమూర్తి గల్లా అరుణ కుమారి.. గతంలో వరుస విజయాలు దక్కించుకున్న సొంత నియోజకవర్గం తిరుపతి జిల్లాలోని చంద్రగిరికి గల్లా వెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి చంద్రగిరిలో ప్రాతినిధ్యం వహించే స్థాయిలో నాయకులు లేక పోవడంతో గల్లాకు అక్కడ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించే ఛాన్స్ ఉంది.
దీంతో గుంటూరు నుంచి ఎవరిని రంగంలోకి దింపాలనేది టీడీపీలో చర్చకుదారితీస్తోంది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం.. సీఎం జగన్ నివాసం ఉన్న తాడేపల్లి పరిదిలో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా.. దీనిని దక్కించుకుంటే.. పరువు నిలబడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. వైసీపీకి కూడానాయకుల లేమి కనిపిస్తోంది. గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి.. ఇప్పుడు యాక్టివ్గా లేరు.
పైగా ఆయన ఈ దఫా అసెంబ్లీకి పోటీ చేయాలని.. అవసరమైతే.. పార్టీ మారాలని కూడా ఆయన భావిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. దీంతో వైసీపీకి కూడా గుంటూరు నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న జాబితాలో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో .. ఎవరిని నిలబెట్టాలనేది వైసీపీలోనూ చర్చగా మారింది. అటు టీడీపీ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూసి.. తాము నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుండగా.. వైసీపీ వేసే అడుగులు పరిశీలించి.. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని.. టీడీపీ భావిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీల పరిస్థితి ఒకరిపై ఒకరు ఆధారపడినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 14, 2022 9:04 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…