Political News

జాతీయ రాజ‌కీయాల‌పై కేసీఆర్‌ది ప‌క్కా ఎజెండా: ఉండ‌వ‌ల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం భేటీ అయిన విష‌యం తెలిసిందే. కేసీఆర్‌తో భేటీ తర్వాత ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ 10 రోజుల క్రితం తన ఫోన్ చేశారని, ఆయన ఆహ్వానం మేరకే కలిశానని తెలిపారు. పదేళ్ల కిందట ఆయనతో మాట్లాడానని గుర్తు చేశారు. తమ మధ్య భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్) గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు.

బీజేపీ విషయంలో కేసీఆర్ ఆలోచనలు, తన ఆలోచనలు ఒక్కటేనని పేర్కొన్నారు. కేసీఆర్‌తో దాదాపు 3 గంటల పాటు చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో తనతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ కూడా ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌పై ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. “కేసీఆర్ చెప్పిన విషయాలు విని నేను ఆశ్చర్యపోయాను. కేసీఆర్‌కు ఫుల్ క్లారిటీ ఉంది. పక్కా ఎజెండాతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వెళ్లి కలుస్తా. నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యాను.” అని తెలిపారు.

“బీజేపీయేతర పార్టీలను కేసీఆర్ లీడ్ చేయగలరు. దేశ రాజకీయాలపై కేసీఆర్ నాకంటే ఎక్కువ స్టడీ చేశారు. కేసీఆర్ మంచి కమ్యూనికేటర్. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కన్నా కేసీఆర్ బాగా కమ్యూనికేట్ చేయగలరు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరం. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని అనిపిస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయం అవసరం” అని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

నిజానికి, పది రోజుల కిందట ఉండవల్లికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి.. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనను కలవాలని కోరారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ వచ్చిన ఉండవల్లి తాను నగరానికి వచ్చానంటూ కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో కేసీఆర్‌ ఆయన్ను భోజనానికి ఆహ్వానించారు. ప్రగతి భవన్‌లో భోజన సమయంలోనే.. జాతీయ రాజకీయాలపై ఆయన చర్చించారు. అనంతరం, పీకే, ఉండవల్లి, సీఎం కేసీఆర్‌ కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది.

ప్రధానంగా పీకే, ఉండవల్లిలకు కేసీఆర్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ విధానం కింద దక్షిణాది సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిపాయి. దక్షిణాది రాష్ట్రాలకు మోడీ పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకెళ్లాలని చర్చించినట్లు సమాచారం.

This post was last modified on June 14, 2022 8:45 am

Share
Show comments

Recent Posts

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

46 minutes ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

1 hour ago

అన్నగారి విడుదలకు రూటు దొరికింది

వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి…

1 hour ago

చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన…

2 hours ago

శుభ సంక‌ల్పం: రెండు రాష్ట్రాల మ‌ధ్య కొత్త స్నేహం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని…

2 hours ago

‘భర్త’ మహా ‘రాజు’లకు భలే వరం దొరికింది

ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది.…

2 hours ago