Political News

త‌మిళ‌నాడును కుదిపేస్తున్న లాక‌ప్ డెత్స్

justiceforjeyarajandfenix.. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇద్ద‌రు అమాయ‌కుల‌ను పోలీసులు తీవ్రంగా హింసించి వారి మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన ఉదంతం త‌మిళ‌నాడును కుదిపేస్తోందిప్పుడు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ అదే స్థాయిలో త‌మిళ‌నాట ఉద్య‌మానికి దారి తీసేలా ఉందీ ఉదంతం. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తూ.. రాజ‌కీయంగా కూడా దుమారానికి కార‌ణ‌మ‌య్యేలా క‌నిపిస్తున్న ఈ ఉదంతం పూర్తి వివ‌రాలు చూద్దాం.

తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను అమలు చేసింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని శాతంకులం ప్రాంతంలో కూడా లాక్ డౌన్ పెట్టారు. ఐతే వారం రోజుల కింద‌ట జయరాజ్ (59) అతని కుమారుడు ఫెనిక్స్ (31) త‌మ‌ మొబైల్ దుకాణాన్ని గ‌డువు త‌ర్వాత ఐదు నిమిషాల‌కు కూడా మూయ‌లేదు. ఇది గమనించిన శాతంకులం పోలీసులు జయరాజ్, ఫీనిక్స్‌ల‌తో దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రించారు. వాళ్లిద్ద‌రూ దీటుగా బ‌దులిచ్చారు. వాగ్వాదం జ‌ర‌గ‌డంతో ఇద్ద‌రినీ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అక్క‌డ వారిని బ‌ట్ట‌లు విప్పి రెండు మూడు రోజుల పాటు విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్ట‌డంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నార‌. వారి మోకాళ్లు ప‌చ్చ‌డ‌య్యాయి. మ‌ర్మాంగాలు దెబ్బ తిన్నాయి. ప‌రిస్థితి విష‌మించాక వారిని దగ్గరలోని కోవిల్ పట్టి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 22 న కొడుకు ఫీనిక్స్ ప్రాణాలు విడిచాడు, తండ్రి జయరాజ్ పరిస్థితి కూడా క్షీణించి త‌ర్వాతి రోజు ఆయన కూడా మృతిచెందాడు. కేవలం 24 గంటల పరిదిలో రెండు ప్రాణాలను కోల్పోయిన కుటుంబం తీవ‌క‌న విషాదంలొ మునిగిపోయింది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఉదంతం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. రాజ‌కీయంగా పెను దుమారానికి కార‌ణ‌మైంది. ఈ కేసులో ఇద్ద‌రు ఎస్సైలు, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను స‌స్పెండ్ చేశారు.

This post was last modified on June 26, 2020 7:42 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago