Political News

జ‌న‌సేన గ్యారేజీలో నాగ‌బాబు !

ప్ర‌స్తుతం జ‌న‌సేన‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహం ఒక‌టి సిద్ధం చేస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ . ఆ క్ర‌మంలో మ‌రింత విశిష్టం అయిన రీతిలో పార్టీని ప‌టిష్టం చేయాల‌ని అనుకుంటున్నారు. అందుకే అటు సోద‌రుడు నాగ‌బాబు కూడా త‌మ్ముడి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ద‌శ‌లో పాత గాయాలు కొన్ని ప్ర‌జా రాజ్యం పార్టీ రూపంలో ఉండ‌డంతో వాటిని మ‌రిచిపోలేక‌పోతుండ‌డంతో నాగ‌బాబు కూడా చాలా చోట్ల చాలా ప్ర‌శ్న‌లు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్ర‌జా రాజ్యం వేరు జ‌న‌సేన వేరు అని ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మూడ్రోజుల ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో నాగ‌బాబు ఏం నేర్చుకున్నారు ? అధినేత అయిన ప‌వ‌న్కు ఏం చెప్పాలనుకుంటున్నారు ? అన్న‌వే ఇప్పుడిక చ‌ర్చ‌కు తావిచ్చే విష‌యాలు. ప్ర‌శ్న‌లు కూడా !

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో ఉత్త‌రాంధ్ర‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని యోచిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇక్క‌డ బ‌లోపేతం అయితే మిగ‌తా చోట్ల కూడా కంచు న‌గారా మోగించ‌వచ్చ‌న్న‌ది ఆయ‌న భావ‌న.నిన్న కూడా నాగ‌బాబు ఈ ప్రాంత భౌగోళిక అస్తిత్వాన్నీ, ఇక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌నీ ఇలా ఒక్క‌టేంటి చాలా విష‌యాలు చెప్పుకుంటూ వ‌చ్చారు. రుషి కొండ‌ను పాల‌క ప్ర‌భుత్వం ఏ విధంగా త‌వ్వేసిందో చూశాం క‌దా ! ఇక మేం చెప్పేదేముంది అంటూ కీల‌క స‌మ‌స్య‌నూ అడ్ర‌స్ చేశారు.

ఇదే స‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణ విఘాత అభివృద్ధిపై కూడా మాట్లాడారు. కానీ లోతైన అధ్య‌య‌నంతో అయితే ఆయ‌న మాట్లాడ‌లేక‌పోయారు. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌కుండానే దాటేశారు. అయినా కూడా నాగ‌బాబును త‌మ్ముళ్లు బాగానే ఆద‌రించారు. నెత్తిన పెట్టుకుని ఆయ‌న ప‌ర్యట‌న‌ను విజ‌య‌వంతం చేశారు. ఇప్పుడు ప‌వ‌న్ ముందున్న స‌వాళ్లు.

రుషి కొండ‌కు సంబంధించి మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి మాట్లాడ‌డం.. అదేవిధంగా శ్రీ‌కాకుళం లాంటి మారుమూల ప్రాంతాల్లో స‌ముద్రంపైనే జీవ‌న యానం చేస్తున్న మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డం.. ఈ రెండూ చేస్తే ప‌వ‌న్ కు మ‌రింత విశ్వ‌స‌నీయ‌త పెరుగుతుంది. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాగ‌బాబు వ‌ర‌కూ పార్టీకి సంబంధించి కొన్ని మ‌ర‌మ్మ‌తులు చేసినా అవి చాల‌వు. బండి మ‌రింత జోరు అందుకోవాలంటే పొత్తుల‌పై ప‌వ‌న్ క్లారిటీ ఇస్తేనే మేలు.

This post was last modified on June 4, 2022 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

1 hour ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

2 hours ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

6 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

8 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

13 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

13 hours ago