Political News

జ‌న‌సేన గ్యారేజీలో నాగ‌బాబు !

ప్ర‌స్తుతం జ‌న‌సేన‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహం ఒక‌టి సిద్ధం చేస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ . ఆ క్ర‌మంలో మ‌రింత విశిష్టం అయిన రీతిలో పార్టీని ప‌టిష్టం చేయాల‌ని అనుకుంటున్నారు. అందుకే అటు సోద‌రుడు నాగ‌బాబు కూడా త‌మ్ముడి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ద‌శ‌లో పాత గాయాలు కొన్ని ప్ర‌జా రాజ్యం పార్టీ రూపంలో ఉండ‌డంతో వాటిని మ‌రిచిపోలేక‌పోతుండ‌డంతో నాగ‌బాబు కూడా చాలా చోట్ల చాలా ప్ర‌శ్న‌లు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్ర‌జా రాజ్యం వేరు జ‌న‌సేన వేరు అని ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మూడ్రోజుల ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో నాగ‌బాబు ఏం నేర్చుకున్నారు ? అధినేత అయిన ప‌వ‌న్కు ఏం చెప్పాలనుకుంటున్నారు ? అన్న‌వే ఇప్పుడిక చ‌ర్చ‌కు తావిచ్చే విష‌యాలు. ప్ర‌శ్న‌లు కూడా !

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో ఉత్త‌రాంధ్ర‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని యోచిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇక్క‌డ బ‌లోపేతం అయితే మిగ‌తా చోట్ల కూడా కంచు న‌గారా మోగించ‌వచ్చ‌న్న‌ది ఆయ‌న భావ‌న.నిన్న కూడా నాగ‌బాబు ఈ ప్రాంత భౌగోళిక అస్తిత్వాన్నీ, ఇక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌నీ ఇలా ఒక్క‌టేంటి చాలా విష‌యాలు చెప్పుకుంటూ వ‌చ్చారు. రుషి కొండ‌ను పాల‌క ప్ర‌భుత్వం ఏ విధంగా త‌వ్వేసిందో చూశాం క‌దా ! ఇక మేం చెప్పేదేముంది అంటూ కీల‌క స‌మ‌స్య‌నూ అడ్ర‌స్ చేశారు.

ఇదే స‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణ విఘాత అభివృద్ధిపై కూడా మాట్లాడారు. కానీ లోతైన అధ్య‌య‌నంతో అయితే ఆయ‌న మాట్లాడ‌లేక‌పోయారు. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌కుండానే దాటేశారు. అయినా కూడా నాగ‌బాబును త‌మ్ముళ్లు బాగానే ఆద‌రించారు. నెత్తిన పెట్టుకుని ఆయ‌న ప‌ర్యట‌న‌ను విజ‌య‌వంతం చేశారు. ఇప్పుడు ప‌వ‌న్ ముందున్న స‌వాళ్లు.

రుషి కొండ‌కు సంబంధించి మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి మాట్లాడ‌డం.. అదేవిధంగా శ్రీ‌కాకుళం లాంటి మారుమూల ప్రాంతాల్లో స‌ముద్రంపైనే జీవ‌న యానం చేస్తున్న మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డం.. ఈ రెండూ చేస్తే ప‌వ‌న్ కు మ‌రింత విశ్వ‌స‌నీయ‌త పెరుగుతుంది. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాగ‌బాబు వ‌ర‌కూ పార్టీకి సంబంధించి కొన్ని మ‌ర‌మ్మ‌తులు చేసినా అవి చాల‌వు. బండి మ‌రింత జోరు అందుకోవాలంటే పొత్తుల‌పై ప‌వ‌న్ క్లారిటీ ఇస్తేనే మేలు.

This post was last modified on June 4, 2022 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

14 minutes ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

1 hour ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

12 hours ago