Political News

మధ్య తరగతి జనాలకు మోడి షాక్

మధ్యతరగతి జనాలకు నరేంద్రమోడి సర్కార్ తాజాగా పెద్ద షాకిచ్చింది. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే ఇళ్ళల్లో వాడుకుంటున్న గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఎత్తేసింది. ఇక నుండి గ్యాస్ బుక్ చేసుకుంటున్న జనాలు కచ్చితంగా దాని మార్కెట్ ధర చెల్లించాల్సిందే అని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ ప్రకటించారు. ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని, కోట్లాదిమంది మధ్య తరగతి జనాల బడ్జెటపై తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని మోడీనో లేకపోతే మంత్రులో ప్రకటించకుండా సెక్రటరీతో చెప్పించటం గమనార్హం.

దేశవ్యాప్తంగా అన్నీ గ్యాస్ కంపెనీలకు కలిపి సుమారు 30 కోట్లమంది వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 9 కోట్లమంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులుగా ఉన్నారు. అంటే వీరంతా బిలో పావర్టీ లైన్ (బీపీఎల్) కిందకు వస్తారన్నమాట. మరి మిగిలిన 21 కోట్లమంది వినియోగదారుల మాటేమిటి ? ఏమిటంటే మార్కెట్ లో ఎంత ధరుంటే అంతాపెట్టుకుని సిలిండర్ ను కొనుక్కోవాల్సిందే.

విచిత్రం ఏమిటంటే నెలకు రు. 30 వేల రూపాయలు సంపాదించే మధ్య తరగతి జీవికి సిలిండర్ ధర రు. 1055 రూపాయలే ఆసియాలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలకూ సిలిండర్ ధర రు. 1055 మాత్రమే. అంటే పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల విషయంలో మాత్రం మామూలు జనాలను ముఖేష్, అదానీ స్ధాయికి నరేంద్రమోడి ప్రభుత్వం తీసుకెళ్ళింది. 2010లో ముందుగా పెట్రోల్ పైన సబ్సిడీని కేంద్రం ఎత్తేసింది. 2014 చివరలో డీజల్ పైన కూడా సబ్సిడీ ఎత్తేసింది.

ఇదే సమయంలో కిరోసిన్ పైన ఉన్న సబ్సిడీని కూడా కేంద్రం ఎత్తేసింది. ఇపుడు గ్యాస్ సిలిండర్ పైన ఇస్తున్న సబ్సిడీనీ ఎత్తేసింది. నరేంద్రమోడి ప్రభుత్వం పాలసీల వల్ల తీవ్రంగా నష్టపోయేది మధ్య తరగతి జనాలు మాత్రమే. బీపీఎల్ కుటుంబాలకు ఎలాగూ సబ్సిడీలతో పాటు ఎన్నో పథకాలు అందుతున్నాయి. ఎగువ, ధనిక కుటుంబాలకు సబ్సిడీలు ఉన్నా లేకపోయినా పెద్ద సమస్యకాదు. ఎటుతిరిగి దెబ్బపడేది మధ్య తరగతి జనాలమీదే.

This post was last modified on June 3, 2022 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago