Political News

మధ్య తరగతి జనాలకు మోడి షాక్

మధ్యతరగతి జనాలకు నరేంద్రమోడి సర్కార్ తాజాగా పెద్ద షాకిచ్చింది. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే ఇళ్ళల్లో వాడుకుంటున్న గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఎత్తేసింది. ఇక నుండి గ్యాస్ బుక్ చేసుకుంటున్న జనాలు కచ్చితంగా దాని మార్కెట్ ధర చెల్లించాల్సిందే అని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ ప్రకటించారు. ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని, కోట్లాదిమంది మధ్య తరగతి జనాల బడ్జెటపై తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని మోడీనో లేకపోతే మంత్రులో ప్రకటించకుండా సెక్రటరీతో చెప్పించటం గమనార్హం.

దేశవ్యాప్తంగా అన్నీ గ్యాస్ కంపెనీలకు కలిపి సుమారు 30 కోట్లమంది వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 9 కోట్లమంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులుగా ఉన్నారు. అంటే వీరంతా బిలో పావర్టీ లైన్ (బీపీఎల్) కిందకు వస్తారన్నమాట. మరి మిగిలిన 21 కోట్లమంది వినియోగదారుల మాటేమిటి ? ఏమిటంటే మార్కెట్ లో ఎంత ధరుంటే అంతాపెట్టుకుని సిలిండర్ ను కొనుక్కోవాల్సిందే.

విచిత్రం ఏమిటంటే నెలకు రు. 30 వేల రూపాయలు సంపాదించే మధ్య తరగతి జీవికి సిలిండర్ ధర రు. 1055 రూపాయలే ఆసియాలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలకూ సిలిండర్ ధర రు. 1055 మాత్రమే. అంటే పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల విషయంలో మాత్రం మామూలు జనాలను ముఖేష్, అదానీ స్ధాయికి నరేంద్రమోడి ప్రభుత్వం తీసుకెళ్ళింది. 2010లో ముందుగా పెట్రోల్ పైన సబ్సిడీని కేంద్రం ఎత్తేసింది. 2014 చివరలో డీజల్ పైన కూడా సబ్సిడీ ఎత్తేసింది.

ఇదే సమయంలో కిరోసిన్ పైన ఉన్న సబ్సిడీని కూడా కేంద్రం ఎత్తేసింది. ఇపుడు గ్యాస్ సిలిండర్ పైన ఇస్తున్న సబ్సిడీనీ ఎత్తేసింది. నరేంద్రమోడి ప్రభుత్వం పాలసీల వల్ల తీవ్రంగా నష్టపోయేది మధ్య తరగతి జనాలు మాత్రమే. బీపీఎల్ కుటుంబాలకు ఎలాగూ సబ్సిడీలతో పాటు ఎన్నో పథకాలు అందుతున్నాయి. ఎగువ, ధనిక కుటుంబాలకు సబ్సిడీలు ఉన్నా లేకపోయినా పెద్ద సమస్యకాదు. ఎటుతిరిగి దెబ్బపడేది మధ్య తరగతి జనాలమీదే.

Satya

Recent Posts

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

47 minutes ago

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

3 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

7 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

8 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

10 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

10 hours ago