Political News

దావోస్ నుంచి రిట‌ర్న్‌.. పెట్టుబ‌డుల‌పై జ‌గ‌న్ ఏం చెబుతారో?

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక ఫోరం స‌ద‌స్సుకు హాజ‌రైన ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. అక్కడ బిజీబిజీగా గ‌డిపారు. తాజాగా ఆయ‌న ఏపీకి చేరుకున్నారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ సాధిం చిందేంటి?  ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు? అనేది ప్ర‌శ్న‌గా మారింది.

దావోస్‌లో ఏం చేశారు?

వాస్త‌వానికి దావోస్‌కు వెళ్లిన‌ప్పుడు.. అక్క‌డ‌కు వ‌చ్చే విదేశీ కంపెనీల‌ను క‌లుసుకుని.. భారీ ఎత్తున పెట్టుబ‌డులను ఆక‌ర్షించాల్సి ఉంటుంది. కానీ, జ‌గ‌న్ బృందం మాత్రం.. రాష్ట్రంలోనే ఉండే కంపెనీల ప్రతినిధులను కలుసుకుని ఒప్పందం చేసుకుంది. అరబిందో,  దానీ,  గ్రీన్‌కో ల‌తో  చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంది. వాస్తవానికి వీరితో ఒప్పందాలు చేసుకోవాలంటే..వారినే ఏపీకి పిలిస్తే.. స‌రిపోతుంది. లేదా.. సీఎం అయినా.. ఢిల్లీ వెళ్తే.. వారు వ‌స్తారు. కానీ, దావోస్ వెళ్లి మ‌రీ.. వారితో ఒప్ప‌దాలు చేసుకున్నారు.

ఇక‌,  కుదిరిన ఒప్పందాలన్నీ ‘గ్రీన్‌ ఎనర్జీ’ రంగంలోనే కావ‌డం మ‌రో విశేషం. విపక్షంలో ఉండగా సౌర, పవన విద్యుత్తు ఒప్పందాలపై జగన్‌ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో కూడా విరుచుకుపడ్డారు. గ్రీన్‌కోతోపాటు మూడు కంపెనీల పేర్లు ప్రస్తావించి ఆరోపణలు చేశారు. గ్రీన్‌కో సంస్థ చంద్రబాబు హయాంలోనే కర్నూలు జిల్లాలో భారీ ‘గ్రీన్‌ ఎనర్జీ’ ప్రాజెక్టును చేపట్టింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలలు ఈ ప్రాజెక్టు పనులు డోలాయమానంలో పడ్డాయి.

ఇప్పుడు దావోస్‌లో అదే సంస్థతో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి అంటూ ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు అరబిందో కూడా ఇక్కడి కంపెనీనే! ఆ కంపెనీతోనూ దావోస్‌లో గ్రీన్‌ ఎనర్జీపైనే ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్‌ ఎనర్జీపైనే ఒప్పందం చేసుకున్న మరో కంపెనీ అదానీ. చంద్రబాబు హయాంలో అదానీ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని జగన్‌ తిరగదోడారు. ఆ తర్వాత పెట్టుబడులను, ఉద్యోగాల సంఖ్యను కుదించి… అదానీ సంస్థతోనే మరో ఒప్పందం చేసుకున్నారు.

మన దేశంలో, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలతోనే స్విట్జర్లాండ్‌లో ఒప్పందాలు కుదర్చుకున్న జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు?  ఎన్ని వేల కోట్లు ఏపీకి తెచ్చామ‌ని… చెబుతారు?  ఎంత మంది నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించామ‌ని వెల్ల‌డిస్తారు? అనేది చూడాల్సి ఉంది.

దుమ్మురేపిన తెలంగాణ‌

ఏపీతో పోల్చుకుంటే.. దావోస్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం దుమ్ము రేపింద‌నే చెప్పాలి. తొలిరోజే రూ. 600 కోట్ల పెట్టుబడులను సాధించిన తెలంగాణకు..  సమావేశాల చివరిరోజు ఒక్క హ్యుందాయ్‌ కంపెనీ నుంచే రూ. 1,400 కోట్ల పెట్టుబడులపై ప్రకటన వచ్చింది. దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ సీఐవో యాంగ్చోచి తెలంగాణ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సిద్ధమవుతున్న మొబిలిటీ క్లస్టర్‌లో రూ. 1,400 కోట్లతో టెస్ట్‌-ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు యాంగ్చోచి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా.. తెలంగాణ ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షిస్తే.. ఏపీ మాత్రం.. సొంత దేశంలోని కంపెనీల‌ను బ‌తిమాలుకునేందుకు దావోస్ వెళ్లిన‌ట్టు అనిపించింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

This post was last modified on May 31, 2022 4:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

1 hour ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

2 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

3 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago