Political News

టీడీపీ ఓటమికి కారణం చెప్పిన బీజేపీ ఎంపీ

తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు కారణం ఏమిటి? ఈ విషయామై చంద్రబాబు నాయుడు అనేకసార్లు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి తాను ఎంత కష్టపడినా జనాలు తమపార్టీని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధం కావటంలేదని చాలాసార్లే చెప్పారు. అలాంటిది టీడీపీ ఘోర ఓటమి కారణాన్ని  బీజేజీలోకి ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ చాలా సింపుల్ గా తేల్చేశారు.

ఇంతకీ వెంకటేష్ చెప్పిందేమంటే తన హయాంలో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధిచేశారట. అయితే ఏ ప్రాంతాన్ని ఎంతగా అభివృద్ధిచేసినా 24 గంటలూ కేవలం అమరావతి గురించి మాత్రమే మాట్లాడారట. దాంతో రాష్ట్రమంటే అమరావతి తప్ప మరేమీ లేదా అనే వ్యతిరేకత జనాల్లో వచ్చేసిందట. అందుకనే జనాలు టీడీపీని అంత ఘోరంగా ఓడించినట్లు వెంకటేష్ కనిపెట్టేశారు.

మరి ఇదే నిజమైతే రాజధాని అమరావతిని అభివృద్ధి చేసినా గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కూడా టీడీపీ ఎందుకు ఓడిపోయిందనే ప్రశ్నకు వెంకటేష్ ఏమని సమాధానం చెబుతారో.  అమరావతి జపం వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మిగిలిన ప్రాంతాల ప్రజలకు తెలియలేదన్నారు. వెంకటేష్ చెప్పినట్లు అమరావతి కారణంగానే మిగిలిన ప్రాంతంలో జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది నిజమే అనుకుందాం. మరి అమరావతి ప్రాంతంలోని రెండు జిల్లాల్లో టీడీపీ గెలవాలి కదా. మిగిలిన ప్రాంతాలతో పాటు రాజధాని జిల్లాల్లో కూడా ఎందుకని ఓడిపోయిందో వెంకటేష్ చెప్పలేకపోయారు.

ఇదే సమయంలో రాష్ట్రంలోని శీతాకాల రాజధానులుగా విశాఖపట్నం, కర్నూల్లో ఏర్పాటు చేయాలన్నారు. అమరావతినే శాశ్వత రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండును కూడా ఎంపీ వినిపించారు. వేసవి, శీతాకాల రాజధానుల కాన్సెప్టు ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు. అమరావతి మీద వ్యతిరేకతతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్ళటం ఎంతమాత్రం మంచిదికాదని వెంకటేష్ స్పష్టంచేశారు. మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాన్ని, రాజధానుల వివాదానికి ఒక సూచనను బీజేపీ ఎంపీ ఢిల్లీలో ప్రకటించారు.

This post was last modified on May 31, 2022 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago