Political News

రాజకీయ మోక్షం పొందిన రఘువీరా

నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సమైక్య రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. 2009లో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే  వైఎస్ చనిపోయినా రఘువీరా మాత్రం ఐదేళ్ళు మంత్రిగానే ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గరా పనిచేశారు. అంటే ఏకధాటిగా పదేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఇపుడిదంతా ఎందుకంటే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలోని తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటు హ్యాపీగా గడిపేస్తున్నారు. తన పొలంలో వేసిన రాగులు కోతకు రావటంతో గడచిన మూడురోజులుగా పొలం పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. రైతుకూలీలతో కలిసి కోతల్లో బిజీగా ఉన్నారట. తమ ఊరిలోనే ఆ మధ్య పెద్ద గుడి కూడా కట్టించారు. ఒకవైపు ఆధ్యాత్మికత మరవైపు పొలం పనుల్లో మునిగిపోయిన కారణంగా రాజకీయాలకు దూరమైపోయినట్లే అని అనుకుంటున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే కాంగ్రెస్ భవిష్యత్తు మీద స్పష్టమైన అవగాహన వచ్చేసినట్లుంది. అందుకనే అధ్యక్షుడిగా తప్పుకోగానే రాజకీయాలకు దూరమైపోయారు. 2019 ఎన్నికలకు ముందు రఘువీరా వైసీపీలో చేరుతారని కాదు కాదు టీడీపీలో చేరబోతున్నట్లు అనేక ప్రచారాలు జరిగాయి. అయితే ఎందులోను చేరకుండా ఆధ్యాత్మికతతో పాటు  వ్యవసాయంలో మునిగిపోయారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించినందుకు కాంగ్రెస్ కు జరగాల్సిన శాస్తే జరుగుతోంది.

తాజా రాజకీయాలను చూసిన తర్వాత ఏ పార్టీలో కూడా ఇమడలేమని, అలాగే కాంగ్రెస్ కు ఇపుడిప్పుడే మంచి కాలం లేదని అనుకున్నారేమో. ఎన్నిపార్టీల నేతలు వెళ్ళి కలిసినా రాజకీయాల్లోకి మాత్రం రావడం లేదు. మరి పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయారా లేకపోతే కాంగ్రెస్ కు మంచిరోజులు వస్తాయని అనిపించినపుడు మళ్ళీ రంగప్రవేశం చేస్తారా అనేది మాత్రం సస్పెన్సే. ఏదేమైనా మొదటి నుండి బాగా టచ్ లో ఉంటు, అనుభవమున్న వ్యవసాయరంగంలోనే ఇపుడు ఈ మాజీ మంత్రి హ్యాపీగా ఉన్నారనే అనుకోవాలి. 

This post was last modified on May 31, 2022 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

42 minutes ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

1 hour ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

2 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

2 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

3 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

3 hours ago