Political News

ఈ రాజ్యసభ సీటు వెనుక కథ ఇదేనా?

తెలంగాణాకు చెందిన ఎంతో మంది బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకున్నా రాజ్యసభ ఎంపీగా పనిచేసే అవకాశం డాక్టర్ లక్ష్మణ్ నే వరించింది. లక్ష్మణ్ దశాబ్దాలుగా పార్టీలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణా అధ్యక్షుడిగా, రెండుసార్లు ముషీరాబాద్ ఎంఎల్ఏగా కూడా ఈయన పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.

ఎంఎల్ఏగా ఓడిపోయిన తర్వాతే ఈయనకు పార్టీ అగ్రనాయకత్వం జాతీయ స్థాయి పదవి కట్టబెట్టింది. అయితే ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్ష పదవిలో లక్ష్మణ్ ఎలాంటి సేవలు అందించారో మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రిగా అమిత్ షా యే ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని నడిపిస్తున్నారు. నిజానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకే పెద్దగా పనిలేదు. ఇక పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నేతలకు పనేముంటుంది ?

సొంత రాష్ట్రం తెలంగాణలో కూడా లక్ష్మణ్ ఓబీసీలతో పెద్ద సమావేశం పెట్టినట్లు కూడా లేరు. నిజానికి లక్ష్మణ్ ను ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు నామినేట్ చేయటం అన్నది పార్టీకి లాభించే అంశం కానేకాదు. ఎందుకంటే తెలంగాణాలో పార్టీ బలోపేతానికి డాక్టర్ చేసిందేమీలేదు. ఈ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం పార్టీలో అసలు ఊపన్నదే లేదు. ఇదే సమయంలో పార్టీలో గ్రూపు తగాదాలు బాగా పెరిగిపోయాయి. చాలామంది సీనియర్లు లక్ష్మణ్ ను అసలు పార్టీ అధ్యక్షుడిగానే గుర్తించలేదు.

పార్టీకి జవసత్వాలు అందించటం లక్ష్మణ్ వల్ల కాదని అర్ధమైపోయిన అగ్రనాయకత్వం చివరకు ఈయన్ను తప్పించి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు పగ్గాలు అప్పగించింది. ఎప్పుడైతే బండికి పగ్గాలు అప్పగించారో అప్పటినుండే పార్టీకి జనాల్లో ఒక్కసారిగా ఊపువచ్చేసింది. స్వతహాగానే దూకుడు స్వభావం ఉన్న బండి రకరకాల కార్యక్రమాలతో, పాదయాత్రల పేరుతో జనాల్లో దూసుకుపోతున్నారు. బండి విషయంలో కూడా సీనియర్లలో తీవ్ర అసంతృప్తి ఉందన్నది వాస్తవమే. అయితే  ఆ విషయాన్ని బండి పట్టించుకోకుండా తన కార్యక్రమాలతో జనాల్లో వెళిపోతున్నారు. ఈ పని లక్ష్మణ్ చేయలేకపోయారు. కాకపోతే విధేయతను మాత్రమే అగ్రనాయకత్వం గుర్తించినట్లయ్యిందంతే. 

This post was last modified on May 31, 2022 12:46 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

2 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

2 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

3 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

4 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

6 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

6 hours ago