Political News

బాబుకు ఊపొచ్చింది

ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ ఊపులోనే తొందరలోనే మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని మహానాడు వేదిక మీదే చంద్రబాబునాయుడు ప్రకటించారు. మినీ మహానాడుల నిర్వహణకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయమైంది. ప్రతి మినీమహానాడు మూడు రోజులు జరపబోతున్నారు. బూత్ స్ధాయి నుండి లోక్ సభ నియోజకవర్గ కేంద్రం వరకు అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్నది నాయకత్వం ఆలోచన.

పార్టీ అంచనా ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను పార్టీ పదవులు, అనుబంధ సంఘాల పదవులు, క్రియాశీలక, సాధారణ సభ్యులంతా కలసి సుమారు 60 వేల మందుంటారు. సో ఇన్ని వేల మందితో కలిసి మూడు రోజుల్లో ఒకరోజు బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న విభేదాలను, పంచాయితీలను సర్దుబాటు చేయటం కూడా మినీమహానాడుల నిర్వహణలో ఒక లక్ష్యం.

షెడ్యూల్ ఎన్నికలకు ఇంకున్నది రెండేళ్ళే కాబట్టి ఇప్పటి నుండే సమిష్టిగా పని చేయకపోతే లాభం లేదని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు, సమస్యలను ప్రధానంగా హైలైట్ చేయటం మరో టార్గెట్. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ఎత్తి చూపితేనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలమని పార్టీ అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపటం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయటానికి మినీ మహానాడులే స్పూర్తిగా నిలవాలని పార్టీ అధినేత నేతలకు స్పష్టం చేశారు.

ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతునే మరోవైపు పార్టీని క్షేత్రస్ధాయి నుండి మళ్ళీ బలోపేతం చేయటం కూడా అంతర్లీనంగా ఒక సబ్జెక్టుంది. నిజానికి గడచిన మూడేళ్ళుగా పార్టీలోని చాలామంది సీనియర్లు జనాల్లో తిరిగింది తక్కువనే చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో సీనియర్లలో అత్యధికులు పార్టిసిపేట్ చేయలేదు. చేసిన కొంతమంది కూడా ఏదో తూతూ మంత్రంగా చేశారు. ఇవన్నీ చూసిన తర్వాతే సీనియర్ల విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయంలో నుండి వచ్చిందే యువతకు 40 శాతం టికెట్ల ప్రకటన. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on May 30, 2022 4:33 pm

Share

Recent Posts

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

25 minutes ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

47 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

2 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

3 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

4 hours ago