Political News

బాబుకు ఊపొచ్చింది

ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ ఊపులోనే తొందరలోనే మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని మహానాడు వేదిక మీదే చంద్రబాబునాయుడు ప్రకటించారు. మినీ మహానాడుల నిర్వహణకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయమైంది. ప్రతి మినీమహానాడు మూడు రోజులు జరపబోతున్నారు. బూత్ స్ధాయి నుండి లోక్ సభ నియోజకవర్గ కేంద్రం వరకు అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్నది నాయకత్వం ఆలోచన.

పార్టీ అంచనా ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను పార్టీ పదవులు, అనుబంధ సంఘాల పదవులు, క్రియాశీలక, సాధారణ సభ్యులంతా కలసి సుమారు 60 వేల మందుంటారు. సో ఇన్ని వేల మందితో కలిసి మూడు రోజుల్లో ఒకరోజు బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న విభేదాలను, పంచాయితీలను సర్దుబాటు చేయటం కూడా మినీమహానాడుల నిర్వహణలో ఒక లక్ష్యం.

షెడ్యూల్ ఎన్నికలకు ఇంకున్నది రెండేళ్ళే కాబట్టి ఇప్పటి నుండే సమిష్టిగా పని చేయకపోతే లాభం లేదని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు, సమస్యలను ప్రధానంగా హైలైట్ చేయటం మరో టార్గెట్. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ఎత్తి చూపితేనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలమని పార్టీ అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపటం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయటానికి మినీ మహానాడులే స్పూర్తిగా నిలవాలని పార్టీ అధినేత నేతలకు స్పష్టం చేశారు.

ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతునే మరోవైపు పార్టీని క్షేత్రస్ధాయి నుండి మళ్ళీ బలోపేతం చేయటం కూడా అంతర్లీనంగా ఒక సబ్జెక్టుంది. నిజానికి గడచిన మూడేళ్ళుగా పార్టీలోని చాలామంది సీనియర్లు జనాల్లో తిరిగింది తక్కువనే చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో సీనియర్లలో అత్యధికులు పార్టిసిపేట్ చేయలేదు. చేసిన కొంతమంది కూడా ఏదో తూతూ మంత్రంగా చేశారు. ఇవన్నీ చూసిన తర్వాతే సీనియర్ల విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయంలో నుండి వచ్చిందే యువతకు 40 శాతం టికెట్ల ప్రకటన. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on May 30, 2022 4:33 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

48 seconds ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

1 hour ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

2 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

2 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

3 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

4 hours ago