ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ తో బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చిందనుకుంటున్న సమయంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర సర్కారుపై మోడీ విమర్శలు, రాష్ట్రలో అధికారంలోకి రానున్నట్లు చేసిన కామెంట్లతో విజిల్స్, కేకలతో కార్యకర్తలు హోరెత్తించిన ఉత్సాహం ఇంకా కొనసాగుతున్న సమయంలోనే….బీజేపీ నేత బండ్రు శోభారాణి కాంగ్రెస్ లో చేరారు. అమెరికాలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన శోభారాణి ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న బండ్రు శోభారాణి ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ నేతలు కండువా కప్పి శోభారాణిని పార్టీలోకి ఆహ్వానించారు. బండ్రుశోభారాణి గతంలో టీఆర్ఎస్, టీడీపీ, నవ తెలంగాణ, ప్రజారాజ్యం పార్టీల్లో పనిచేశారు. రెండేళ్ల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆమె రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన బండ్రు శోభారాణి బీజేపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఆలేరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా బీర్ల ఐలయ్య ఉన్నారు. ఆలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్న శోభారాణికి కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణలో బలపడాలని చూస్తున్న సమయంలో, ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర స్థాయి నేత చేరడం… బీజేపీలోని అంతర్గత లుకలుకలను బయటపెడుతుందని అంటున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…