తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. మహానాడులో లోకేష్ మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటే సీనియర్లు అంటే వృద్ధతరం తప్పుకోవాలన్నారు. వృద్ధతరం తప్పుకోకపోతే ఇక యువతకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని గట్టిగానే ప్రశ్నించారు. నిజానికి ఇపుడున్న సీనియర్లలో అత్యధికులు ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు చేరినవాళ్ళే. అందుకనే వాళ్ళంతా ఇపుడు ఏడు పదుల వయసు దాటిపోయారు.
ఇదే విషయమై లోకేష్ మాట్లాడుతూ మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో ఓడిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. నిజంగా ఇది మంచి నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండుసార్లు ఓడిపోతేనే జనాలు తిరస్కరిస్తున్నారని అర్ధమైపోతుంది. అలాంటిది మూడు సార్లు ఓడిపోవటమంటే పార్టీకి గుదిబండకిందే లెక్క. కాబట్టి అలాంటివారికి టికెట్ నిరాకరించటంలో తప్పేలేదు. అయితే వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారు పార్టీలో దాదాపు లేరనే చెప్పాలి.
నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగుసారల్గా ఓడిపోతునే ఉన్నారు. ఇక్కడ టీడీపీ చివరిసారిగా గెలిచింది 1999 ఎన్నికల్లో మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద నాలుగు సార్లు వరుసగా ఓడిపోయిన అభ్యర్ధి ఇంకోరులేరు. అయితే తునిలో నాలుగుసార్లు యనమల సోదరులు ఓడిపోతున్నారు. రెండుసార్లు యనమల రామకృష్ణుడు ఓడిపోతే, రెండుసార్లు ఆయన సోదరుడు యనమల కృఫ్ణుడు ఓడిపోయారు.
అంటే అంటే లోకేష్ తాజా ప్రకటన చూస్తే సోమిరెడ్డి, యనమలను టార్గెట్ చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏది ఏమైనా ఇటు సోమిరెడ్డి, అటు యనమల ఇద్దరు పార్టీకి గుదిబండలుగా తయారయ్యింది మాత్రం వాస్తవం. ఎంఎల్ఏలుగా ఓడిపోయి శాసనమండలి నుండి ఎన్నికై మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. బహుశా ఇదే విషయం లోకేష్ ను బాగా ఇబ్బంది పెడుతున్నట్లుంది. నిజానికి ఇద్దరు కూడా తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయారు. ఏదో చంద్రబాబునాయుడు మొహమాటం వల్ల టికెట్లు సంపాదించుకుంటున్నారంతే. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మందున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ టికెట్లు కట్ చేసి యువతకు కేటాయిస్తే పార్టీకి కాస్త ఊపన్నా వస్తుంది.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…