తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యంతో వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ఏపీ రేషన్ రైస్ మాఫియా చేస్తున్న అక్రమాలపై వివరించారు. ఏయే రూట్లల్లో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తోందనే విషయాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్కు రాసిన లేఖకు జత చేశారు. తమిళనాడులోని పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్కు రాసిన లేఖకు జత చేశారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నందున తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపో తోందని ధ్వజమెత్తారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారని పేర్కొన్నారు.
రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. కొంత మొత్తం కర్ణాటకకు కూడా అక్రమంగా తరలిపోతోందని ఆరోపిం చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండి పడ్డారు. దీనికి సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలో దాదాపు 13 కేసులు నమోదయ్యాయని వివరించారు.
స్థానిక ప్రజలు సైతం చాలా మంది స్మగ్లర్లను పట్టుకుంటున్నా.. కేసులు నమోదు కావడం లేదని మండిపడ్డారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నందున తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు ఇదే అంశం పై చర్యలు కోరుతూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రస్తుతం ఇది రెండు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది.
This post was last modified on May 24, 2022 5:05 pm
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…