పెట్రో వివాదంలో మెల్లగా కేసీఆర్ ను లాక్కొచ్చారు బండి సంజయ్. కేసీఆర్ అనుకుంటే లీటరు పెట్రోలును 80 రూపాయలకే ఇవ్వవచ్చని అంటున్నారాయన. నిజంగానే ఇది సాధ్యమా అంటే ! రాష్ట్రాలు తమ పన్నుల వాటాను తగ్గించుకుంటే సాధ్యమే అంటున్నాయి బీజేపీ వర్గాలు. దీంతో ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. ఇప్పటికే బీజేపీకీ, టీఆర్ఎస్ కూ వివాదం రగులుతున్న నేపథ్యంలో బండి సంజయ్ చెప్పే మాటలు లేదా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
మరోవైపు పెట్రో ధరల తగ్గింపు అన్నది పెద్దగా ఏమీ లేదని కాంగ్రెస్ పెదవి విరుపు విరుస్తోంది. సోషల్ మీడియా వివరాలు అందిస్తోంది. 44 రూపాయలకు పైగా పెంచి, కేవలం ఎనిమిది అంటే ఎనిమిది రూపాయలు తగ్గించి కేంద్రం తనదైన రాజకీయం చేస్తోందని అంటోంది. ఇక ఇవాళ హైద్రాబాద్ లో పెట్రోల్ ధర 109.67 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర 97.82 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో మాత్రం లీటరు పెట్రోలు ధర 96 రూపాయల 72 పైసలుగా ఉంది. ప్రధాన నగరాల్లో ఢిల్లీలో మాత్రమే కాస్తో కూస్తో పెట్రో ధర తగ్గి ఉంది.
పొరుగున ఉన్న బెంగళూరులో 101 రూపాయల 94 పైసలుగా లీటరు పెట్రోలు ఉంది. అదేవిధంగా మరో పొరుగు ప్రాంతం చెన్న య్ లో 102 రూపాయల 63 పైసలుగా ఉంది. ఏ విధంగా చూసుకున్నా హైద్రాబాద్ లో పెట్రో ధర దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నగరాల కన్నా ఎక్కువగానే ఉంది. మరోవైపు కేంద్రం మాత్రం తాము ఎక్సైజ్ డ్యూటీ దగ్గించడం వల్ల లక్ష కోట్ల నష్టం వస్తోందని అంటోంది. అంటే ప్రజల కోసం ఈ సారి కేంద్రం చేస్తున్న త్యాగం విలువ లక్ష కోట్లా అని.. విపక్షం పెదవి విరుస్తోంది. రాష్ట్రం వాటా కింద ఉన్న వ్యాట్ ముప్పై రూపాయలుగా ఉందని, దానిని తగ్గిస్తే 80 కే ఇవ్వవచ్చని అంటోంది తెలంగాణ బీజేపీ.
This post was last modified on May 22, 2022 2:00 pm
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…