బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తన పదవికి రాజీనామా చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొంటూ రాజీనామా లేఖను విడుదల చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని, ఆయన దేశాన్ని శక్తిమంతం అయిన భారత్ గా రూపొందింపజేస్తారు అన్న నమ్మకంతోనే ఇటుగా వచ్చానని పేర్కొంటూ, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించే క్రమంలో మోడీ కృషి చేస్తారు అని భావించే ఇటుగా వచ్చేనని ఆయన తన లేఖలో కొన్ని విషయాలు ప్రస్తావించారు. నరేంద్ర మోడీ అవినీతి రహిత, సుస్థిర పాలన అందిస్తారన్న నమ్మకంతోనే తాను ఇటుగా అడుగులు వేశానని అన్నారు. ఏదేమయినప్పటికీ రావెల ప్రస్థానం బీజేపీలో ముగిసింది.
నవ్యాంధ్రలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. తరువాత కొన్ని ఆరోపణల రీత్యా టీడీపీ నుంచి తప్పుకుని జనసేన తో బంధం పెంచుకున్నారు. అక్కడా నిలదొక్కుకోలేకపోయారు. తరువాత పరిణామాల నేపథ్యంలో బీజేపీ లో సభ్యత్వం అందుకుని, కీలక పదవి దక్కించుకున్నారు. సోము వీర్రాజు తరువాత స్థానం ఆయనదే అవ్వడం ఇక్కడ ప్రస్తావనార్హం. కానీ పదవిలో ఉండగా జగన్ ను పెద్దగా టార్గెట్ చేయలేదు. అలానే వీడిపోతున్న వేళ పార్టీ పై కూడా పెద్దగా అసంతృప్తి ఏమీ వ్యక్తం చేయలేదు. మరి! ఆయన ప్రస్థానం ఎటు ?
బీజేపీకి రాజీనామా చేసిన తరువాత టీడీపీలోకి మళ్లీ ఆయన వెళ్లనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇవేవీ కాదని వైసీపీ గూటికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. గుంటూరు జిల్లా, తాడికొండ మండలంకు చెందిన ఆయన కొంత కాలం ఆర్థిక శాఖ అధ్యాపకుడిగా పనిచేశారు. ప్రకాశం జిల్లాలో ఆయన తన అధ్యాపక వృత్తిని కొనసాగించారు. తరువాత ఆయన గుజరాత్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబెషినరీ ఆఫీసర్ గా పనిచేశారు.
తరువాత దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి దగ్గర కూడా పీఎస్ గా పనిచేశారు. 2014లో ఐఆర్ఎస్ ఆఫీసర్ గా తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి, ఇటుగా వచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి మేకతోటి సుచరితను ఓడించారు. చంద్రబాబు సర్కారులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అటు తరువాత కుమారుడిపై కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం ఒడిదొడుకుల నేపథ్యంలోనే ఉంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…