Political News

రావెల ప్ర‌స్థానం బీజేపీలో ముగిసింది !

బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగ ఉపాధ్య‌క్షులు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తన ప‌ద‌వికి రాజీనామా చేశారు. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని పేర్కొంటూ రాజీనామా లేఖ‌ను విడుద‌ల చేశారు. నరేంద్ర మోడీ నాయ‌క‌త్వంపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, ఆయ‌న దేశాన్ని శ‌క్తిమంతం అయిన భార‌త్ గా రూపొందింప‌జేస్తారు అన్న న‌మ్మ‌కంతోనే ఇటుగా వ‌చ్చాన‌ని పేర్కొంటూ, ఆర్థిక, రాజ‌కీయ అస‌మానత‌లు తొల‌గించే క్ర‌మంలో మోడీ కృషి చేస్తారు అని భావించే ఇటుగా వ‌చ్చేన‌ని ఆయన త‌న లేఖ‌లో కొన్ని విషయాలు ప్ర‌స్తావించారు. న‌రేంద్ర మోడీ అవినీతి ర‌హిత, సుస్థిర పాల‌న అందిస్తార‌న్న న‌మ్మకంతోనే తాను ఇటుగా అడుగులు వేశాన‌ని అన్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రావెల ప్ర‌స్థానం బీజేపీలో ముగిసింది.

న‌వ్యాంధ్ర‌లో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. త‌రువాత కొన్ని ఆరోప‌ణ‌ల రీత్యా టీడీపీ నుంచి త‌ప్పుకుని జ‌న‌సేన తో బంధం పెంచుకున్నారు. అక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయారు. త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ లో స‌భ్య‌త్వం అందుకుని, కీల‌క ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. సోము వీర్రాజు త‌రువాత స్థానం ఆయ‌నదే అవ్వ‌డం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. కానీ ప‌ద‌విలో ఉండ‌గా జ‌గ‌న్ ను పెద్ద‌గా టార్గెట్ చేయ‌లేదు. అలానే వీడిపోతున్న వేళ పార్టీ పై కూడా పెద్ద‌గా అసంతృప్తి ఏమీ వ్య‌క్తం చేయ‌లేదు. మ‌రి! ఆయ‌న ప్ర‌స్థానం ఎటు ?

బీజేపీకి రాజీనామా చేసిన త‌రువాత టీడీపీలోకి మ‌ళ్లీ ఆయ‌న వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఇవేవీ కాద‌ని వైసీపీ గూటికి చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. గుంటూరు జిల్లా, తాడికొండ మండ‌లంకు చెందిన ఆయ‌న కొంత కాలం ఆర్థిక శాఖ అధ్యాప‌కుడిగా ప‌నిచేశారు. ప్ర‌కాశం జిల్లాలో ఆయ‌న త‌న అధ్యాపక వృత్తిని కొనసాగించారు. త‌రువాత ఆయ‌న గుజ‌రాత్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబెషిన‌రీ ఆఫీస‌ర్ గా ప‌నిచేశారు.

తరువాత దివంగ‌త స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి ద‌గ్గ‌ర కూడా పీఎస్ గా ప‌నిచేశారు. 2014లో ఐఆర్ఎస్ ఆఫీస‌ర్ గా త‌న ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి, ఇటుగా వ‌చ్చారు. ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి మేక‌తోటి సుచరిత‌ను ఓడించారు. చంద్ర‌బాబు స‌ర్కారులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అటు త‌రువాత కుమారుడిపై కొన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌దవి నుంచి త‌ప్పుకున్నారు. అక్క‌డి నుంచి ఆయ‌న రాజ‌కీయ జీవితం ఒడిదొడుకుల నేప‌థ్యంలోనే ఉంది.

This post was last modified on May 16, 2022 6:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago