Political News

సుప్రీంపై మోడీ సర్కార్ మండిపోతోందా ?

సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిపోతోందా ? ఈ కారణంగానే సుప్రీంకోర్టు పై నరేంద్ర మోడీ సర్కార్ మండి పోతోందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సుప్రీం-కేంద్ర ప్రభుత్వ మధ్య గ్యాప్ పెరగటానికి కారణం 124 ఏ సెక్షన్ అంటే రాజద్రోహం చట్టం. ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణారహితంగా పలువురిపై కేసులు నమోదు చేస్తున్నాయి. దీంతో రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలంటు దేశవ్యాప్తంగా గోల పెరిగిపోతోంది.

దీనిపై కేంద్ర మాజీ మంత్రితో పాటు పాత్రికేయులు, పలువురు ప్రముఖులు సుప్రింకోర్టులో కేసులు వేశారు. దాంతో సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. అయితే ఈ విచారణలో రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయటానికి కేంద్రం ఏ మాత్రం సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ స్పష్టంగా చెప్పేశారు. అంటే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయటానికి లేదా మార్పులు చేయటానికి కూడా కేంద్రం అంగీకరించలేదు.

కేంద్రంతో ఇక లాభం లేదనుకున్న సుప్రీం ప్రస్తుతానికి 124 ఏ చట్టం అమలును నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు లేదని చెప్పింది. ఇప్పటికే అరెస్టు చేసుంటే వారందరు బెయిల్ ద్వారా బయటకు వచ్చే వెసులు బాటును కల్పించింది.  అలాగే విచారణ పూర్తయ్యే వరకు ఎవరిపైనా రాజద్రోహం కేసులు నమోదు చేయద్దని చెప్పింది. అంటే రాజద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మోడీ సర్కార్ కు ఏ మాత్రం రుచించ లేదని అర్ధమైపోతోంది. ఈ చట్టం బ్రిటీష్ హయాంలో 1880లో తయారైంది.

ఈ చట్టం కింద అరెస్టయి జైళ్ళల్లో సుమారు 13 వేలమందున్నారు. ఇపుడు వాళ్ళందరికీ ఊరట లభించినట్లయ్యింది. 2015-20 మధ్య దేశంలో 548 మంది ప్రముఖులు వివిధ ఆరోపణలతో  ఈ చట్టం ద్వారా  అరెస్టయ్యారు. వీరిలో 6 మంది మాత్రమే ఆరోపణలు నిరూపణమయ్యాయి. మరి మిగిలిన వారి పరిస్ధితేంటి ? గతంలో కేంద్రం తయారు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను కూడా కేంద్రమే నిలిపేసింది. అలాగే పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడకంపైన దాఖలైన కేసుల్లో కూడా కేంద్రం సహకరించకపోయినా సుప్రింకోర్టే విచారిస్తోంది. 

This post was last modified on May 12, 2022 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

5 minutes ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

24 minutes ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

1 hour ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

1 hour ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

2 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

4 hours ago