ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు, తదనంతర పరిణామాలు.. ఆయనకు బెయిల్ లభించడం వంటి కీలక అంశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనుక రాజకీయ కక్ష సాధింపు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక వేళ తాము.. రాజకీయ కక్ష సాధింపులకు దిగాలని అనుకున్నా.. రాజకీయ కక్ష సాధింపే నిజమైనా.. ముందు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయించేవాళ్లం అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అదే నిజమైతే.. చంద్రబాబు వదిలేస్తామా? అని మీడియాను ప్రశ్నించారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకే పేపర్ లీక్కు పాల్పడినట్లు వెల్లడించారు. నారాయణ ఆదేశాల మేరకు అక్రమాలు చేసినట్లు కళాశాల డీన్ బాలగంగాధర్ పోలీసులకు తెలిపారన్నారు. నారాయణ ప్రమేయం ఉండటం వల్లే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారన్నారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని… రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్ట్ చేయించేవారమని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారై విద్యా సంస్థల్లో నేర సంస్కృతిని పాటిస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. చీడ పురుగులా మారి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పరీక్షల వ్యవస్థలో చెద పురుగుల్లా పట్టి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయని ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్లో చైతన్య విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని.. వారినీ వదిలే ప్రసక్తి లేదన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్ వెనుక ఎవరున్నా.. ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభం కానప్పటికీ అక్రమాలు జరిగాయని సజ్జల అన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని తెలిపారు. నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఓ విప్లవకారుడిని అరెస్టు చేసినట్లు హడావిడి చేస్తున్నారని.. మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టాలా? అని సజ్జల ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్నందువల్లే నారాయణను పోలీసులు అరెస్టు చేశారని, రాజకీయ ముసుగులో ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామన్నారు.
This post was last modified on May 12, 2022 8:34 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…