Political News

వైకాపా భయపడిపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఇక గరిష్టంగా అధికారంలో కొనసాగేది రెండేళ్లే. ట్రెండ్ చూస్తుంటే జగన్ రెండేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాడని అనిపించట్లేదు. అంతకంతకూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుండటం.. ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుండటంతో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లడానికే ప్రయత్నిస్తాడనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముందస్తు ఎన్నికలు గ్యారెంటీ అని.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల మాదిరి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లకు పరిమితం అయితే కుదరదు. ఇక జనాల్లోకి వెళ్లాల్సిందే. ఈ దిశగా ‘గడప గడపకు వైకాపా’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అధికార పార్టీ. ఈ ప్రోగ్రాంలో భాగంగా వైకాపా నేతలు ఇంటింటికీ తిరగడానికి ప్రణాళిక రచించారు. ఐతే మూడేళ్లలో సంక్షేమ పథకాల కింద డబ్బులేయడం మినహాయిస్తే జగన్ సర్కారు పెద్దగా సాధించిందేమీ లేదు. అభివృద్ధి ఊసే లేదు. రోడ్లు దారుణాతి దారుణంగా తయారయ్యాయి.

అదే సమయంలో ధరల మోత మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో జనాగ్రహం చవిచూడాల్సి వస్తుందేమో అని వైకాపా నాయకుల్లో ఆందోళన నెలకొంది. సొంత పార్టీ కార్యకర్తలే తీవ్ర అసంతృప్తితో ఉండటం, మెజారిటీ జనాల్లో ఆగ్రహం ఉండటంతో ఈ ప్రోగ్రాం ఎలాంటి ఫలితాన్నిస్తుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో పార్టీ అంతర్గత సమావేశంలో వైకాపా నేతలు.. జనాల్లోకి ఎలా వెళ్లగలమని బహిరంగ వ్యాఖ్యలు చేయడం.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఒక చోట జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం లాంటి పరిణామాలను వైకాపా అధినాయకత్వం గమనించినట్లే కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే పార్టీ పేరుతో అనుకున్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రోగ్రాంగా మార్చినట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న ‘గడప గడపకు వైకాపా’ పేరును.. ‘గడప గడపకు ప్రభుత్వం’ అని మార్చారు. పార్టీ పరంగా వెళ్తే ఇబ్బంది తప్పదని.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మీద కొంత సానుకూలత ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా మార్చినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్గంలో వెళ్లినా జనాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని చెప్పలేం.

This post was last modified on May 11, 2022 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

53 minutes ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

1 hour ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

3 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago