Political News

నిన్న రాంమాధవ్, నేడు కిషన్ రెడ్డి: జగన్‌పై బీజేపీ స్వరం మారుతోందా?

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ-వైసీపీ అంతర్గత మిత్రులు అనే విమర్శలు ఇతర పార్టీల నుండి వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ లోపాయికారి ఒప్పందం లేదా మద్దతు వల్లే జగన్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. జీవీఎల్ నర్సింహారావు వంటి బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా వైసీపీకి అనుకూలంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి వారు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా గత ప్రభుత్వంపై చేసిన విమర్శల ఘాటు కనిపించడం లేదనే వాదనలు ఉన్నాయి.

అయితే ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్, తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గత కొద్ది రోజులుగా వైసీపీపై బీజేపీ స్వరం మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఏపీలోని అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే అధికార పార్టీని నిలదీయాలి. ఆ దిశలో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

జగన్ పాలన అన్నింటా రివర్స్ మంత్ర అని, ఆయనకు శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన ఏడాది పాటు చేసిన ఏపీ ప్రభుత్వ పాపాలు మరిచిపోయినట్లు కాదని, మద్యపాన నిషేధం, పోలవరం టెండర్లు, తిరుమల భూములు, రాజధాని అమరావతి.. ఇలా ఏపీలో అంతా రివర్స్ పాలన సాగుతోందని రామ్ మాధవ్ దాదాపు రెండు వారాల క్రితం నిప్పులు చెరిగారు. అసలు వారానికోసారి కోర్టు తప్పుపడుతున్న ప్రభుత్వం ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. ఈ ఏడాదిలో కోర్టు నుండి దాదాపు 60సార్లు మొట్టికాయలు తిన్నదన్నారు.

తాజాగా, కిషన్ రెడ్డి కూడా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం అసత్యాలతో గడుపుతోందని, అహంకారపూరిత, అభివృద్ధి నిరోధక పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని, అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని నిలదీశారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడ్డటం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల రాజ్యాంగబద్దంగా నిరసన తెలిపినా కేసు పెట్టడమేమిటన్నారు. జగన్ పాలన అంతా అరాచక, అవినీతి, దౌర్జన్య పాలన అన్నారు.

This post was last modified on June 24, 2020 2:20 am

Share

Recent Posts

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

18 minutes ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

39 minutes ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

55 minutes ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

1 hour ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

2 hours ago

30 ఏళ్ల కింద‌ట శంకుస్థాప‌న చేసి ఇప్పుడు ప్రారంభిస్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. 30 ఏళ్ల కింద‌ట తాను చేసిన శంకు స్థాప‌న తాలూకు…

2 hours ago