Political News

నిన్న రాంమాధవ్, నేడు కిషన్ రెడ్డి: జగన్‌పై బీజేపీ స్వరం మారుతోందా?

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ-వైసీపీ అంతర్గత మిత్రులు అనే విమర్శలు ఇతర పార్టీల నుండి వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ లోపాయికారి ఒప్పందం లేదా మద్దతు వల్లే జగన్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. జీవీఎల్ నర్సింహారావు వంటి బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా వైసీపీకి అనుకూలంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి వారు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా గత ప్రభుత్వంపై చేసిన విమర్శల ఘాటు కనిపించడం లేదనే వాదనలు ఉన్నాయి.

అయితే ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్, తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గత కొద్ది రోజులుగా వైసీపీపై బీజేపీ స్వరం మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఏపీలోని అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే అధికార పార్టీని నిలదీయాలి. ఆ దిశలో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

జగన్ పాలన అన్నింటా రివర్స్ మంత్ర అని, ఆయనకు శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన ఏడాది పాటు చేసిన ఏపీ ప్రభుత్వ పాపాలు మరిచిపోయినట్లు కాదని, మద్యపాన నిషేధం, పోలవరం టెండర్లు, తిరుమల భూములు, రాజధాని అమరావతి.. ఇలా ఏపీలో అంతా రివర్స్ పాలన సాగుతోందని రామ్ మాధవ్ దాదాపు రెండు వారాల క్రితం నిప్పులు చెరిగారు. అసలు వారానికోసారి కోర్టు తప్పుపడుతున్న ప్రభుత్వం ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. ఈ ఏడాదిలో కోర్టు నుండి దాదాపు 60సార్లు మొట్టికాయలు తిన్నదన్నారు.

తాజాగా, కిషన్ రెడ్డి కూడా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం అసత్యాలతో గడుపుతోందని, అహంకారపూరిత, అభివృద్ధి నిరోధక పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని, అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని నిలదీశారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడ్డటం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల రాజ్యాంగబద్దంగా నిరసన తెలిపినా కేసు పెట్టడమేమిటన్నారు. జగన్ పాలన అంతా అరాచక, అవినీతి, దౌర్జన్య పాలన అన్నారు.

This post was last modified on June 24, 2020 2:20 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

2 hours ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

3 hours ago

అనంత‌పురంలో కియాను మించిన మ‌రో పరిశ్ర‌మ‌!

మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల వేట‌లో కీల‌క‌మైన రెన్యూ ఎన‌ర్జీ ఒక‌టి. 2014-17 మ‌ధ్య కాలంలో కియా కార్ల…

3 hours ago

కొడాలి నానికి అందరూ దూరమవుతున్నారు

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్‌.. కొడాలి నానికి రాజ‌కీయంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో గట్టి ప‌ట్టుంది. ఆయ‌న వ‌రుస విజ‌యాలు…

4 hours ago

మొత్తానికి పాక్ చెర నుంచి విడుదలైన బీఎస్ఎఫ్ జవాన్

పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…

4 hours ago

కింగ్ డమ్ ఫిక్స్ – తమ్ముడు తప్పుకున్నట్టేనా

మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…

5 hours ago