రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై విచారణను హైకోర్టే సూమోటోగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై అత్యాచారాలు ఆగని పక్షంలో జనాల్లో భయం పెరిగిపోతుందన్నారు. అందుకనే అత్యాచార ఘటనలను కోర్టే విచారణకు స్వీకరిస్తే జనాల్లో కాస్త ధైర్యం వస్తుందన్నారు. ఈ పద్ధతిలో హైకోర్టు చొరవ చూపించి ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ బిడ్డలు మృగాళ్ళ బారిన పడకుండా తల్లిదండ్రులే కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నట్లు పవన్ ఎద్దేవా చేశారు. అయితే అందరూ గమనించాల్సిన ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. ఇటీవల జరిగిన రేపులు… భర్తల ఎదుట చేసినవి, ఇంట్లోకి తలుపుకొట్టి దూరి చేసినవి ఉన్నాయి. అవన్నీ గ్యాంగ్ రేప్ లు. ఇటువంటి విషయంలో… కుటుంబం ఎలా తమవాళ్లను రక్షించుకోగలదు.
బాధ్యత గలిగిన పోలీసు అధికారులు, సిబ్బందే అత్యాచారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతుండటం పట్ల పవన్ ఆందోళన వ్యక్తంచేశారు. అభంశుభం తెలియని పసిపిల్లలు, గర్భిణులు, మానసిక పరిస్ధితి సరిగా లేని వాళ్ళపైన కూడా దాడులు, అత్యాచారాలు జరగటం బాధేస్తోందన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని, ధైర్యంగా తిరిగే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధితుల వివరాలను గోప్యంగా ఉంచమని చట్టం చెబుతుంటే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటు పవన్ మండిపడ్డారు. బాధితుల తాలూకు కుటుంబసభ్యలకు పరిహారం ఇచ్చే విషయాన్ని ఫొటోలు తీసుకుని మీడియాకు రిలీజ్ చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. తల్లిదండ్రుల పెంపకాన్ని మంత్రి తప్పుపట్టడంపైనా మండిపడ్డారు.
This post was last modified on May 7, 2022 10:41 am
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…