Political News

గొంతు లేస్తే.. గెంటేస్తా: జ‌గ‌న్ వార్నింగ్‌

వైసీపీ ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు, క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు సీఎం జ‌గ‌న్ బ‌ల‌మైన వార్నింగ్ ఇచ్చారు. అస‌మ్మ‌తిని ఎట్టి ప‌రిస్థితిలోనూ.. స‌హించేది లేద‌న్నారు. ఎవ‌రైనా.. అలా చేయాల‌ని సాహ‌సం చేస్తే.. అన్ని రూపాల్లోనూ వారిని అణిచేస్తామ‌ని తీవ్ర‌స్తాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌.. ఎలా ప‌డితే.. అలా .. వాగితే.. ఆయా గొంత‌లు విప్పిన‌వారిని పార్టీ నుంచి గెంటేస్తామ‌ని.. వార్నింగ్ ఇచ్చారు.

పార్టీలో అసమ్మతి స్వరాలు, వర్గ విభేదాల‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ స‌హించేదిలేద‌న్నారు. పార్టీనేత‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. విభేధాలు వీడి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మే 2 నుంచి ‘ఇంటింటికి వైకాపా’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్లతోనూ భేటీ అయిన జగన్ పలు అంశాలపై వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో అసమ్మతి స్వరాలు త‌గ్గించుకోవాల‌ని సూచించారు. ఎన్నిక‌ల‌కు ముందు.. తాను చెప్పే చివ‌రి మాట ఇదేన‌న్నారు. వర్గ విభేదాలను ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్రొత్స‌హించ‌బోన‌న్నారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా పార్టీ కోసం ప‌నిచేయాల్సిందేనని స్ప‌ష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, ఇతర అంశాలపైనా జ‌గ‌న్ చర్చించారు. మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు.

మే 2 నుంచి ‘ఇంటింటికి వైసీపీ’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ కార్య‌క్ర‌మం ఆషామాషీ కాద‌ని.. నాయ‌కుల త‌ల‌రాత‌లు మారుస్తుంద‌ని.. వెల్ల‌డించారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని…  అప్పుడు ఏడ్చి మొర‌పెట్టుకున్నా.. ఉప‌యోగం లేద‌ని జగన్‌ హెచ్చరించారు. ఈ సంద‌ర్భంగా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌ర్నూలులో మాజీ ఎమ్మెల్యే సునీల్ సంగ‌తిని జ‌గ‌న్ గుర్తు చేశారు.

సంక్షేమకార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేసిన జగన్‌… మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించి భంగపడిన అసంతృప్త నేతలను… సముదాయించారు. విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎవరూ బహిరంగ విమర్శలు చేయొద్దన్న జగన్‌… ప్రజాప్రతినిధులు పని తీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని సమావేశంలో సీఎం చెప్పారు.

This post was last modified on April 28, 2022 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

31 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago