Political News

పీకేను త‌ప్పించ‌డం వెనుక‌.. `పెద్ద‌` కార‌ణ‌మే ఉందా?!

ఊర‌కరారు మ‌హాను భావులు అన్న‌ట్టుగా… సీఎం జ‌గ‌న్ అంత‌టివాడు.. రాజ‌కీయంగా ఒక అడుగు వేస్తే.. దానికి వంద కార‌ణాలు ఉంటాయి. త‌న‌కు ఏమీ లాభం లేకుంటే.. రాజ‌కీయ నేత‌.. చెయ్యి కూడా విద‌ల్చ‌డన్న‌ట్టుగా.. జ‌గ‌న్ కూడా అంతే… త‌న‌కు ఏమీ ప్ర‌యోజ‌నం లేక‌పోతే.. ఏ చిన్న మార్పు, చేర్పు కూడా చేయరనేది వాస్త‌వం అంటారు పార్టీ నాయ‌కులు. తాజాగా.. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. `మాకు ఆయ‌న సేవ‌లు అవ‌స‌రం లేదు` అని తేల్చి చెప్పేశారు.

అయితే.. 2017 నుంచి స‌యామీ క‌వ‌ల‌లు మాదిరిగా.. ఒక‌రి సూచ‌న‌ల‌ను మ‌రొక‌రు పాటించిన వారు.. ఒక్క సారిగా విడిపోవ‌డ‌మా? అనేది రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌శాంత్ కిషోర్‌.. లేక‌పోతే.. వ్యూహాలులేవు.. వ్యూహాలు లేక‌పోతే..పార్టీనే లేదు.. అని చెప్పుకొనే వైసీపీ నేత‌లు.. ఈ నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా నిర్ఘాంత పోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము సొంత‌గానే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని వైసీపీ అధిష్టానం తేల్చేసిన అంశంపై మ‌రింత‌గా విస్తుపోయారు. అయితే.. పీకేను తీసేయ‌డం వెనుక‌.. ఒక‌ప‌టిష్ట‌మైన కార‌ణమే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పీకే విష‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెరిగిపోయింద‌నేది.. మేధావుల మాట‌. గ‌త కొన్నాళ్లుగా జాతీయ స్థాయి రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న శ‌క్తుల‌ను బీజేపీ కూడ‌దీస్తోంది. అదేస‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగాఉన్న శ‌క్తుల‌ను కాంగ్రెస్ అక్కున చేర్చుకునేందుకు ప్ర‌యత్నిస్తోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న వైసీపీతో ఎప్పుడైనా త‌మ‌కు అవ‌స‌రం ఉంటుంద‌ని భావిస్తున్న బీజేపీ పెద్ద‌లు.. వైసీపీ అధినేత‌ను త‌మకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే బీజేపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్న పీకేతో.. వైసీపీ చెలిమి చేయ‌డాన్ని.. బీజేపీ పెద్ద‌లు స‌హించ‌లేక‌పోతున్నార‌నేది ఢిల్లీ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఉన్న చ‌ర్చ‌. పైగా… ఇటీవ‌ల కాంగ్రెస్‌లో ఆయ‌న చేరేందుకు రెడీ కావ‌డం.. పైగా.. వైసీపీతో పోత్తు పెట్టుకోవాల‌ని.. ఆయ‌న సూచించ‌డం వంటి ప‌రిణామాలు.. స‌హ‌జంగానే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని త‌మ‌కు అడ్డు పెట్టుకోవాల‌ని(ఏదైనా తేడా వ‌స్తే) భావిస్తున్న బీజేపీకి ప్రాణ‌సంక‌టంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే పీకే వ్యూహం కాంగ్రెస్ ఎక్క‌డ అమ‌లు చేస్తుందోన‌ని భావించి.. కేంద్రంలోని నెంబ‌ర్ 2, 3 స్థాయి పెద్ద‌లు రంగంలోకి దిగిపోయార‌ని అంటున్నారు..

మంగ‌ళ‌వారం ఉద‌యం ఢిల్లీ నుంచి జ‌గ‌న్‌కు ఫోన్ రావ‌డం.. ఆ వెంట‌నే పీకేపై నిర్ణ‌యం తీసుకుని ప్ర‌క‌టించ‌డం.. జ‌రిగిపోయాయ‌ని ఢిల్లీలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అవుతున్నారనే సంకేతాలు.. క‌నుక బ‌య‌ట‌కు వెళ్తే.. వైసీపీకి పునాదులు క‌దిలిపోవ‌డం ఖాయ‌మ‌న‌ని జ‌గ‌న్ సైతం అనుమానించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఎంతో ఇష్ట‌మే అయిన‌ప్ప‌టికీ…అటు ఢిల్లీ పెద్ద‌ల ఆదేశాలు.. క‌న్నెర్ర‌లు.. ఇటు.. రాష్ట్రంలో క‌ద‌ల‌బారే పునాదుల‌ను దృష్టిలో పెట్టుకుని.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా.. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా.. అడుగు వేశార‌ని.. అంటున్నారు.  మొత్తానికి పీకే ను ప‌క్క‌న పెట్ట‌డంలో.. చాలా `పెద్ద` వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

బోరింగ్ అన్నారు… కోట్లు ఇచ్చేస్తున్నారు

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…

7 minutes ago

అడ్రస్ లేని సినిమా గురించి మెగా హీరో ఏమన్నాడు?

సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…

28 minutes ago

బంగారం లాంటి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది

పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…

57 minutes ago

మరి సురేందర్ రెడ్డి సంగతేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…

3 hours ago

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

3 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

6 hours ago