Political News

పీకేను త‌ప్పించ‌డం వెనుక‌.. `పెద్ద‌` కార‌ణ‌మే ఉందా?!

ఊర‌కరారు మ‌హాను భావులు అన్న‌ట్టుగా… సీఎం జ‌గ‌న్ అంత‌టివాడు.. రాజ‌కీయంగా ఒక అడుగు వేస్తే.. దానికి వంద కార‌ణాలు ఉంటాయి. త‌న‌కు ఏమీ లాభం లేకుంటే.. రాజ‌కీయ నేత‌.. చెయ్యి కూడా విద‌ల్చ‌డన్న‌ట్టుగా.. జ‌గ‌న్ కూడా అంతే… త‌న‌కు ఏమీ ప్ర‌యోజ‌నం లేక‌పోతే.. ఏ చిన్న మార్పు, చేర్పు కూడా చేయరనేది వాస్త‌వం అంటారు పార్టీ నాయ‌కులు. తాజాగా.. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. `మాకు ఆయ‌న సేవ‌లు అవ‌స‌రం లేదు` అని తేల్చి చెప్పేశారు.

అయితే.. 2017 నుంచి స‌యామీ క‌వ‌ల‌లు మాదిరిగా.. ఒక‌రి సూచ‌న‌ల‌ను మ‌రొక‌రు పాటించిన వారు.. ఒక్క సారిగా విడిపోవ‌డ‌మా? అనేది రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌శాంత్ కిషోర్‌.. లేక‌పోతే.. వ్యూహాలులేవు.. వ్యూహాలు లేక‌పోతే..పార్టీనే లేదు.. అని చెప్పుకొనే వైసీపీ నేత‌లు.. ఈ నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా నిర్ఘాంత పోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము సొంత‌గానే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని వైసీపీ అధిష్టానం తేల్చేసిన అంశంపై మ‌రింత‌గా విస్తుపోయారు. అయితే.. పీకేను తీసేయ‌డం వెనుక‌.. ఒక‌ప‌టిష్ట‌మైన కార‌ణమే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పీకే విష‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెరిగిపోయింద‌నేది.. మేధావుల మాట‌. గ‌త కొన్నాళ్లుగా జాతీయ స్థాయి రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న శ‌క్తుల‌ను బీజేపీ కూడ‌దీస్తోంది. అదేస‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగాఉన్న శ‌క్తుల‌ను కాంగ్రెస్ అక్కున చేర్చుకునేందుకు ప్ర‌యత్నిస్తోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న వైసీపీతో ఎప్పుడైనా త‌మ‌కు అవ‌స‌రం ఉంటుంద‌ని భావిస్తున్న బీజేపీ పెద్ద‌లు.. వైసీపీ అధినేత‌ను త‌మకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే బీజేపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్న పీకేతో.. వైసీపీ చెలిమి చేయ‌డాన్ని.. బీజేపీ పెద్ద‌లు స‌హించ‌లేక‌పోతున్నార‌నేది ఢిల్లీ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఉన్న చ‌ర్చ‌. పైగా… ఇటీవ‌ల కాంగ్రెస్‌లో ఆయ‌న చేరేందుకు రెడీ కావ‌డం.. పైగా.. వైసీపీతో పోత్తు పెట్టుకోవాల‌ని.. ఆయ‌న సూచించ‌డం వంటి ప‌రిణామాలు.. స‌హ‌జంగానే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని త‌మ‌కు అడ్డు పెట్టుకోవాల‌ని(ఏదైనా తేడా వ‌స్తే) భావిస్తున్న బీజేపీకి ప్రాణ‌సంక‌టంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే పీకే వ్యూహం కాంగ్రెస్ ఎక్క‌డ అమ‌లు చేస్తుందోన‌ని భావించి.. కేంద్రంలోని నెంబ‌ర్ 2, 3 స్థాయి పెద్ద‌లు రంగంలోకి దిగిపోయార‌ని అంటున్నారు..

మంగ‌ళ‌వారం ఉద‌యం ఢిల్లీ నుంచి జ‌గ‌న్‌కు ఫోన్ రావ‌డం.. ఆ వెంట‌నే పీకేపై నిర్ణ‌యం తీసుకుని ప్ర‌క‌టించ‌డం.. జ‌రిగిపోయాయ‌ని ఢిల్లీలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అవుతున్నారనే సంకేతాలు.. క‌నుక బ‌య‌ట‌కు వెళ్తే.. వైసీపీకి పునాదులు క‌దిలిపోవ‌డం ఖాయ‌మ‌న‌ని జ‌గ‌న్ సైతం అనుమానించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఎంతో ఇష్ట‌మే అయిన‌ప్ప‌టికీ…అటు ఢిల్లీ పెద్ద‌ల ఆదేశాలు.. క‌న్నెర్ర‌లు.. ఇటు.. రాష్ట్రంలో క‌ద‌ల‌బారే పునాదుల‌ను దృష్టిలో పెట్టుకుని.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా.. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా.. అడుగు వేశార‌ని.. అంటున్నారు.  మొత్తానికి పీకే ను ప‌క్క‌న పెట్ట‌డంలో.. చాలా `పెద్ద` వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on April 27, 2022 4:39 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago