తాజా, మాజీ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్లాసు బాగా పనిచేసిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నెల్లూరులోని మాజీ మంత్రి అనీల్ కుమార్ ఇంటికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్ళారు. వీరిద్దరు సుమారు అర్ధగంటకు పైగా మాట్లాడుకున్నారు. చాలాకాలంగా వీళ్ళద్దరికి ఏమాత్రం పడటం లేదు. అందుకనే మొన్న కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత వీళ్ళ మధ్య విబేధాలు మరింతగా పెరిగిపోయాయి.
బాధ్యతలు తీసుకుని మొదటిసారి మంత్రి నెల్లూరుకు వచ్చిన రోజే అనిల్ నగరంలోని క్లాక్ టవర్ సెంటర్లో భారీ సమావేశం నిర్వహించారు. పైగా బలప్రదర్శన కాదని చెబుతున్నా తన సత్తా ఏమిటో చాటి చెప్పటమే అనీల్ ఉద్దేశ్యంగా అర్ధమైపోతోంది. ఒకవైపు అనిల్ సమావేశం మరోవైపు పార్టీ ఆఫీసులో కాకాణి సమావేశం రెండు ప్యారలల్ గా ఒకేసారి జరిగాయి. ఇద్దరి సమావేశాల మధ్యలో మిగిలిన నేతలు ఇబ్బంది పడిపోయారు.
ఇద్దరిలో ఎవరి సమావేశానికి హాజరుకావాలో అర్ధంకాక కొందరు నేతలు రెండు సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అనిల్ సమావేశాన్ని వాయిదా వేయించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. ఇదే కాకుండా మంత్రిని ఉద్దేశించి అనిల్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. ఇవన్నీ జగన్ దృష్టికి వెళ్ళాయి. దాంతో ఇక ఉపేక్షిస్తే లాభంలేదని వీళ్ళ గొడవలు మరింతగా పెరిగిపోతాయని జగన్ కు అర్థమైంది. అందుకనే ఇద్దరినీ పిలిపించుకుని ఫుల్లుగా క్లాసు పీకారు.
Yదాని ఫలితంగానే హఠాత్తుగా వీరిద్దరి భేటీ. భేటీ తర్వాత వీళ్ళు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెడతామని చెప్పారు. జగన్ క్లాస్ పీకిన వెంటనే ఇద్దరు విడివిడిగా మాట్లాడినా జాయింట్ కూడా మీడియా సమావేశం పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి. చూస్తుంటే క్లాస్ ప్రభావం బాగానే పనిచేసినట్లుంది. మరి ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుందో చూడాలి.
This post was last modified on April 27, 2022 11:17 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…