Political News

జగన్మోహన్ రెడ్డి క్లాసు బాగా పని చేసిందా?

తాజా, మాజీ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్లాసు బాగా పనిచేసిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నెల్లూరులోని మాజీ మంత్రి అనీల్ కుమార్ ఇంటికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్ళారు. వీరిద్దరు సుమారు అర్ధగంటకు పైగా మాట్లాడుకున్నారు. చాలాకాలంగా వీళ్ళద్దరికి ఏమాత్రం పడటం లేదు. అందుకనే మొన్న కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత వీళ్ళ మధ్య విబేధాలు మరింతగా పెరిగిపోయాయి.

బాధ్యతలు తీసుకుని మొదటిసారి మంత్రి నెల్లూరుకు వచ్చిన రోజే అనిల్ నగరంలోని క్లాక్ టవర్ సెంటర్లో భారీ సమావేశం నిర్వహించారు. పైగా బలప్రదర్శన కాదని చెబుతున్నా తన సత్తా ఏమిటో చాటి చెప్పటమే అనీల్ ఉద్దేశ్యంగా అర్ధమైపోతోంది. ఒకవైపు అనిల్ సమావేశం మరోవైపు పార్టీ ఆఫీసులో కాకాణి సమావేశం రెండు ప్యారలల్ గా ఒకేసారి జరిగాయి. ఇద్దరి సమావేశాల మధ్యలో మిగిలిన నేతలు ఇబ్బంది పడిపోయారు.

ఇద్దరిలో ఎవరి సమావేశానికి హాజరుకావాలో అర్ధంకాక కొందరు నేతలు రెండు సమావేశాలకు డుమ్మా కొట్టేశారు.  అనిల్ సమావేశాన్ని వాయిదా వేయించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. ఇదే కాకుండా మంత్రిని ఉద్దేశించి అనిల్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. ఇవన్నీ జగన్ దృష్టికి వెళ్ళాయి. దాంతో ఇక ఉపేక్షిస్తే లాభంలేదని వీళ్ళ గొడవలు మరింతగా పెరిగిపోతాయని జగన్ కు అర్థమైంది. అందుకనే ఇద్దరినీ పిలిపించుకుని ఫుల్లుగా క్లాసు పీకారు.

Yదాని ఫలితంగానే హఠాత్తుగా వీరిద్దరి భేటీ. భేటీ తర్వాత వీళ్ళు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెడతామని చెప్పారు. జగన్ క్లాస్ పీకిన వెంటనే ఇద్దరు విడివిడిగా మాట్లాడినా జాయింట్ కూడా మీడియా సమావేశం పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి. చూస్తుంటే క్లాస్ ప్రభావం బాగానే పనిచేసినట్లుంది.  మరి ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుందో చూడాలి. 

This post was last modified on April 27, 2022 11:17 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

2 mins ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

3 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

3 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

4 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

5 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

6 hours ago