తాజా, మాజీ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్లాసు బాగా పనిచేసిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నెల్లూరులోని మాజీ మంత్రి అనీల్ కుమార్ ఇంటికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్ళారు. వీరిద్దరు సుమారు అర్ధగంటకు పైగా మాట్లాడుకున్నారు. చాలాకాలంగా వీళ్ళద్దరికి ఏమాత్రం పడటం లేదు. అందుకనే మొన్న కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత వీళ్ళ మధ్య విబేధాలు మరింతగా పెరిగిపోయాయి.
బాధ్యతలు తీసుకుని మొదటిసారి మంత్రి నెల్లూరుకు వచ్చిన రోజే అనిల్ నగరంలోని క్లాక్ టవర్ సెంటర్లో భారీ సమావేశం నిర్వహించారు. పైగా బలప్రదర్శన కాదని చెబుతున్నా తన సత్తా ఏమిటో చాటి చెప్పటమే అనీల్ ఉద్దేశ్యంగా అర్ధమైపోతోంది. ఒకవైపు అనిల్ సమావేశం మరోవైపు పార్టీ ఆఫీసులో కాకాణి సమావేశం రెండు ప్యారలల్ గా ఒకేసారి జరిగాయి. ఇద్దరి సమావేశాల మధ్యలో మిగిలిన నేతలు ఇబ్బంది పడిపోయారు.
ఇద్దరిలో ఎవరి సమావేశానికి హాజరుకావాలో అర్ధంకాక కొందరు నేతలు రెండు సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అనిల్ సమావేశాన్ని వాయిదా వేయించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. ఇదే కాకుండా మంత్రిని ఉద్దేశించి అనిల్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. ఇవన్నీ జగన్ దృష్టికి వెళ్ళాయి. దాంతో ఇక ఉపేక్షిస్తే లాభంలేదని వీళ్ళ గొడవలు మరింతగా పెరిగిపోతాయని జగన్ కు అర్థమైంది. అందుకనే ఇద్దరినీ పిలిపించుకుని ఫుల్లుగా క్లాసు పీకారు.
Yదాని ఫలితంగానే హఠాత్తుగా వీరిద్దరి భేటీ. భేటీ తర్వాత వీళ్ళు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెడతామని చెప్పారు. జగన్ క్లాస్ పీకిన వెంటనే ఇద్దరు విడివిడిగా మాట్లాడినా జాయింట్ కూడా మీడియా సమావేశం పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి. చూస్తుంటే క్లాస్ ప్రభావం బాగానే పనిచేసినట్లుంది. మరి ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుందో చూడాలి.
This post was last modified on April 27, 2022 11:17 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…