జిగ్నేష్ మేవానీ… దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాకా అయిన గుజరాత్లో స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత. గత కొద్దికాలంగా సంచలన పరిణామాలతో వార్తల్లోకి ఎక్కారు. ‘ఇన్ని సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ భారత మువ్వన్నెల జెండాను ఏనాడు ఎగరేయలేదని, మోడీ గాడ్సే భక్తుడు’ అంటూ జిగ్నేష్ మేవానీ గతంలో తన ట్విటర్ లో పోస్ట్ చేశారు.
దీంతో ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టారనే కారణం చూపుతూ అస్సాం పోలీసులు మేవానీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరో కేసులో మళ్లీ అరెస్టయిన జిగ్నేష్ పుష్ప మేనరిజంతో వార్తల్లోకి ఎక్కారు. ప్రధానిపై చేసిన ట్వీట్ నేపథ్యంలో కేసులో అరెస్టైన మేవానీకి… సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎస్కార్ట్ గా ఉన్న ఓ మహిళా పోలీసుపై మేవానీ అసభ్యకరంగా ప్రవర్తించారనే అభియోగంతో ఆయనను అస్సాం పోలీసులు ఇటీవల మళ్లీ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన్ను వాహనంలో తీసుకెళ్తున్న క్రమంలో … మేవానీ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మ్యానరిజంతో కనిపించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా ‘తగ్గేదే లే’ అంటూ బదులిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, జిగ్నేష్ తరఫున సైతం మరో వాదన వినిపిస్తోంది. మహిళా కానిస్టేబుల్ తో మేవానీ అసభ్యంగా ప్రవర్తించలేదని, కావాలనే ఆయనపై కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారని మేవానీ తరఫు లాయర్ తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తన జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాయని, అయితే వాటి బెదిరింపులకు భయపడేదిలేదని మేవానీ గతంలో ప్రకటించారు. కాగా, దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిన కేసులో వార్తల్లో నిలిచిన వ్యక్తి పుష్పా మేనరిజంతో వార్తల్లో నిలిచారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on April 27, 2022 11:12 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…