Political News

ఇక రెండేళ్ళూ జనాల్లోనేనా?

షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా జనాల్లో పర్యటనలకు రెడీ అయిపోతున్నారు. ఈనెల 27వ తేదీన మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని అందరికీ క్లారిటీ ఇవ్వబోతున్నారు. అందుకు తగ్గట్లే పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి ప్రభుత్వపరంగా తాను తీసుకోబోతున్న చర్యలను వివరించేందుకే కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గడచిన మూడేళ్ళలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పథకాలను అందుకుంటున్న జనాల అభిప్రాయాలు తెలుసుకునేందుకే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమానికి సీఎం తొందరలోనే శ్రీకారం చుట్టుబోతున్నారు. మే నెలలో రచ్చబండ కార్యక్రమంతో జిల్లాల పర్యటనలు మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించారు. 

రాబోయే ఎన్నికల్లో జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలపై పెద్ద బాధ్యతలనే జగన్ మోపారు. జిల్లాల్లో మంత్రులు, ఎంఎల్ఏల మధ్య సమన్వయం సాధించటం, ఎంఎల్ఏలకు, పార్టీ క్యాడర్ కు మధ్య సమన్వయం పెంచటం అనే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. మొత్తంమీద మంత్రులైనా, ఎంఎల్ఏలు అయినా రెగ్యులర్ గా జనాలతో టచ్ లో ఉండటమే కీలకమని జగన్ చెప్పబోతున్నారు.

తొందరలోనే చంద్రబాబు నాయుడు కూడా జిల్లాల పర్యటన పెట్టుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం పేరుతో పవన్ అనంతపురం, పశ్చిమగోదావరిలో పర్యటించారు. ప్రతిపక్షాల నేతలు ఏదో రూపంలో జనాలతో టచ్ లో ఉంటున్న కారణంగా మంత్రులు, ఎంఎల్ఏలు కూడా జనాల్లోనే ఉండే తప్పని పరిస్ధితి. ఇదే విషయాన్ని జగన్ చెప్పబోతున్నారు. పనిలోపనిగా తన పర్యటనల విషయంపైన  కూడా క్లారిటి ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొత్తానికి జిల్లాల అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయకర్తలుగా మాజీ మంత్రులకు జగన్ పెద్ద బాధ్యతలే పెట్టినట్లు అర్ధమవుతోంది. మరి జగన్ టార్గెట్లను వీళ్ళు అందుకుంటారో లేదో చూడాల్సిందే.

This post was last modified on April 26, 2022 2:28 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సందీప్ కిషన్ సినిమాలో ఫాదర్ ట్విస్టు

రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…

26 mins ago

మహాసేన రాజేష్.. మళ్లీ యుటర్న్

మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…

1 hour ago

నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…

1 hour ago

నారా లోకేష్ కోసం.. రోడ్డెక్కిన‌ నంద‌మూరి కుటుంబం !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త…

1 hour ago

అంబటికి మళ్లీ అల్లుడి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…

1 hour ago

ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అవసరమంటారా

ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…

4 hours ago