Political News

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు బ్రేక్‌

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బండి సంజయ్ విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఈ యాత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి సన్నిధి అలంపూర్ నుంచి ప్రారంభమైంది.

31 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో 29 రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బండి సంజయ్ పర్యటిస్తారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలతో సహా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతోంది.

ఎండలు విపరీతంగా ఉండడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కాస్త విరామం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలకు బండి స్వ‌యంగా వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల జోగులాంబ వ‌ద్ద‌.. టీఆర్ ఎస్‌, బీజేపీ శ్రేణుల మ‌ధ్య తీవ్ర వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో యాత్ర‌కు బ్రేక్ ప‌డుతుంద‌ని అనుకున్నా.. అలా జ‌ర‌గ‌లేదు. వాస్త‌వానికి పాదయాత్రలో ఉన్న బండి సంజ‌య్‌.. రెండు రోజులుగా అస్వస్ధతకు గురైన‌ట్టు పార్టీ నేత‌లు చెబుతున్నారు.

12 రోజులుగా ఎండల్లో పాదయాత్ర చేస్తున్నందున ఆయ‌న కొంత నీర‌స‌ప‌డ్డార‌ని అంటున్నారు. రెండురోజులపాటు రెస్ట్ తీసుకోవాల ని వైద్యులు సూచించిన‌ట్టు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ షెడ్యుల్ ప్రకారం పాదయాత్ర చేస్తానని బండి పార్టీ నేత‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అయితే.. సోమ‌వారం ఉదయం వైద్యులు.. బండికి  వైద్య పరీక్షలు నిర్వహించారు. సోడియం, పోటాషియం లెవల్స్‌లో తేడాను వైద్యులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో బండి త‌న పాద‌యాత్ర‌ను రెండు రోజుల పాటు విర‌మించుకునేందుకు నిర్ణ‌యిం చిన‌ట్టు  పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌ళ్లీ తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తెలియాల్సి ఉంది.

This post was last modified on April 26, 2022 9:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

2 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

26 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago