రాజధాని అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఊహించని సంఘటన. ఎందుకంటే.. అమరావతిని మార్చి మూడు రాజధానులకు నిన్న మొన్నటి వరకు మొగ్గు చూపిన వైసీపీ అధినేత జగన్ వ్యూహాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేస్తుండడమే!. ఇదే విషయంపై తాడేపల్లి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. అనేక సందర్భాల్లో మూడు రాజధానుల కే తాముకట్టుబడి ఉన్నామని.. పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా జగన్ ప్రకటించారు. వికేంద్రీకరణ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు.
అంటే మూడు రాజధానులకే ఆయన కట్టుబడి ఉన్నాననేది సుస్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు అమరావతి పనులు ప్రారంభించారు. కూలీలకు రైతులు పువ్వులు ఇచ్చి స్వాగతం కూడా పలికారు. దీనికి కారణం.. కోర్టుల నుంచి అమరావతికే అనుకూలంగా తీర్పులు రావడం. ఈనేపథ్యంలో జగన్ ఇప్పుడు ఏం చేయాలి? ఏంచేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ఆయన న్యాయసలహా తీసుకుని.. ముందుకు సాగాలని నిర్ణయించు కున్నట్టు చెప్పారు. అయితే.. ఈ సమయంలోనే.. విజయవాడ, గుంటూరు నగరాలనే.. రాజధానులుగా.. అంటే జంట నగరాలుగా మార్చే వ్యూహంపై జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ విషయంపైనా.. ఆయన చూచాయగా.. కీలక నేతలకు సంకేతాలు పంపారు.
అమరావతి అయితే.. విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉందని.. అదేవిధంగా గుంటూరుకు కూడా 25 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పుకొచ్చారు. సో.. అలా కాకుండా..ఈ రెండు రాజధానుల్లో ఒకదానిని ఎంపికచేసుకుని పాలనా పరమైన రాజధానిని ఏర్పాటు చేస్తే.. అమరావతి నుంచి కూడా విమర్శలు తగ్గుముఖం పడతాయని.. అన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విజయవాడ, గుంటూరులను రాజధానులుగా ప్రకటిస్తే.. ఇతర ప్రాంతాల వారికి కూడా రవాణా సౌకర్యంతోపాటు.. ఎలాంటి ఇబ్బందులు రావని అంచనా వేస్తున్నారట. అయితే.. రాజధాని విషయంలో కోర్టు తీర్పును అమలు చేయాలని కూడా భావిస్తున్నారట.
దీనికి పాలకపార్టీలోని మెజారిటీ నాయకులు కూడా అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. నిజానికి ఇప్పటి వరకు విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించే ప్రయత్నం చేశారు. అయితే.. ఇంతలో.. న్యాయస్థానం నుంచి తీర్పు.. అమరావతి రైతులకు అనుకూలంగా వచ్చింది. ఈ క్రమంలో.. విజయవాడ, లేదా గుంటూరు నగరాల్లో ఒకదానిని ఎంపిక చేసుకుంటే.. అటు అమరావతిపై తన పంతం నెగ్గించుకున్నట్టు ఉంటుంది.. డెవలప్ చేయడం ద్వారా.. కోర్టు తీర్పు గౌరవించినట్టు కూడా ఉంటుందని జగన్ భావిస్తున్నారట. ప్రస్తుతం కొత్త కేబినెట్ కొలువు దీరడంతో … తొలి సమావేశంలోనే దీనిని చర్చించే విషయం పరిశీలిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on April 25, 2022 7:24 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…