Political News

కాంగ్రెస్‌లోకి పీకే.. తెర వెనుక తెలుగోడు!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త‌న ప్ర‌స్తుత ప‌నుల‌కు బైబై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేర‌నుండ‌టం దాదాపుగా ఖ‌రారు అయిపోయిన సంగ‌తి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ అధినేత‌ సోనియా గాంధీకి ప్రజెంటేషన్ ఇవ్వ‌నుండ‌టం అనే ఎపిసోడ్‌తో మొద‌లైన చ‌ర్చ‌… `ఎలాంటి ష‌ర‌తులు లేకుండా పీకే కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు` అని కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు బహిరంగంగా మీడియా ముందు ప్ర‌క‌టించే వ‌ర‌కు చేరింది.

ఇక మిగిలింది అధికారికంగా పీకే మూడు రంగుల కండువా క‌ప్పుకోవ‌డ‌మే. అయితే, పీకే కాంగ్రెస్ పార్టీలో చేర‌డం వెనుక ఓ తెలుగోడు ఉన్నార‌ట‌. ఆయ‌నే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్తను రాజ‌కీయ నాయ‌కుడిగా మార్చే ప్లాన్ చెప్పార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్ర‌శాంత్ కిషోర్ భేటీ అవ‌డం, అనంత‌రం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేర‌డం వెనుక ఉన్న‌ది తెలుగు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త అయిన సునీల్ క‌నుగోలు. ఈ విష‌యం చెప్పింది పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు స్ట్రాటజిస్టుల అవసరం లేదని, తమ పార్టీలో నాయకులు తప్ప స్ట్రాటజిస్టులు ఉండరని అన్నారు.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతార‌ని, ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని రేవంత్ అన్నారు. పీకేను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేదే స్ట్రాటజిస్టు సునీల్ అనుకోవచ్చని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

హాట్ టాపిక్‌గా మారిన టీఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తుపైనా రేవంత్ రెడ్డి స్పందిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే టీఆర్ఎస్ తో తమకు పొత్తు ఉండదని రేవంత్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, మే 6న రాష్ట్ర ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని రేవంత్ అన్నారు. రేవంత్ అధ్యక్షతను పీసీసీ విసృత స్థాయి సమావేశం జరగ‌డం, అందులో పీకే గురించి ఇలాంటి కామెంట్లు చేయ‌డంతో… టీఆర్ఎస్‌ కాంగ్రెస్ రాజ‌కీయం గురించి హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది.

Satya

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago